Tuesday 26 May 2015 0 comments By: satyasrinivasg

అణు విస్ఫోటాలు-పర్యావరణ విధ్వoసం-34

భారం
ఎంత విచిత్రం
నా ముప్పైయ్యో ఏట
బతకకూడదని
ఇక అదికాక
కొనసాగించాలంతే...
గడిచిన కాలాన్ని
అందమైనవి, భయంకరమైనవి,
బరువైనవి,తడిసిన, మొద్దుల్లా..
సమాధిలో వున్నట్టు!
ఆత్మలు ఆలపించవు
గతిలేక మూగవైపోతాయి:
రోగగ్రస్తులవుతాయి
నొప్పులు  భరించేకంటే
అందుకే  శ్వాస తీసుకోవడం కష్టం.
నేను ఎగరదలచుకోలేదు!
లోతులేని అంచున వున్నా.
స్వర్గపు చేరువలో వున్నా.
ఇప్పటికే ఈ దారులలో అలసిపోయా,
నన్ను ఎగరేసినవే...
ఇక పై ఎగరలేను!
స్వర్గంలో మొహాలు  ప్రతిబింబిస్తాయి.
వాళ్ళ మొహాలు
నేనెవరికైతే వీడ్కోలు చెప్పానో.
ఏ ఒక్కరినీ మరవలేను!
మర్చిపోయే స్ధితి లేదు!
ఆత్మ, అది వున్నట్టుగా వుండడం—
దుర్లభమైన స్మ్రుతి
దేనినీ  తుడిపేయలేo,
దేనినీ తీసేయలేo,
దేనినీ రద్దుచేయలేo,
దేనినీ సవరించలేo!..
... ఇక మిగిలిన,-- భారం కూడా  పవిత్రమైనదే,
ఎంత బరువుంటే
అంత ప్రియమైనది!
(  రష్యన్  నుండి అనువాదం,లియోనిడ్ లెవిన్, ఎల్జివియత్ రిట్చ్), పునః సమీక్షించిన వారు-ల్యుబోవ్ సిరోటా)
(అనుసృజన- జి. సత్య శ్రీనివాస్)
--------
రేడియో ఫోబియా
ఇది కేవలం-- రేడియేషన్ గురించి భయమా?
లేక-- యుద్ధం గురించి ఆందోళనా?
లేక-- యుద్ధం గురించి ఆందోళనా?
లేక-నమ్మకద్రోహం అన్న బెదురా,
పిరికితనం,మూర్ఖత్వం,చట్టలేమి?
వీట్ని సవరించే కాలం ఆసన్నమైంది
రేడియో ఫోబియా అంటే ఏమిటి.
అది—
చర్నోబిల్ డ్రామాని అనుభవించినవారు చెప్పడానికి నిరాకరిస్తారు
మంత్రులకు చెప్పిన వాస్తవాల్ని
("ఇక్కడఈ రోజు నువ్వు ఇంతే మింగ గల్గుతావు!")
మేము తప్పుకోం
అబద్ధపు రహస్య  సమాచారాలనుండి,
మూల ఆలోచనలనుండి,
మీరు ఏ రంకా చిత్రీకరించినప్పటికి!
మేము ఆశించం-- ఇక మీరు సూచిoచకండి వాట్ని!—
ప్రపంచాన్ని అధికారిక  కళ్ళద్దాలతో చూడమని!
మాకు చాలా అనుమానాలున్నాయి!
ఇంకా, అర్ధమవుతుంది, మాకు జ్ఞాపకం
ప్రతి బాధితుడు సోదరుడు లాంటి వాడు!...
ఇప్పుడు మనం  సున్నితమైన భూమిని చూస్తున్నాం
వదిలిసేన భవనాల అద్దాలనుండి.
ఈ అద్దాలు ఇంక మనని మోసం చేయలేవు!—
ఈ అద్దాలిప్పుడు మనకి స్పష్టంగా చూపిస్తాయి—
నను నమ్మండి—
కుంచికుపోతున్న నదులు,
విషపూరితమైన అడవులు,
పిల్లలు జన్మించేది ఎదగడానికి కాదు...
పెద్ద మామలు , మీరేమి పెట్టారు
టెలివిజన్ లో ధైర్య నటనకంటే?
పిల్లలెంత ముచ్చటగా ఆస్వాదించారో
రేడియషన్, ఒకప్పుడు ప్రమాదకరమని నమ్మినదాన్ని!...
(పెద్దలే రేడియోఫోబియాతో  భయపడతారు—
పిల్లలు ఇంకా దీనికి అలవాటుపడుతున్నారా?)
ఈ ప్రపంచానికి ఏమైంది
అత్యoత  మానవత్వo గల  వృత్తి కూడా
అధికారింగా మారిందా?
రేడియో ఫోబియా
ఏమో మీరు సర్వాoతర్యామిలు అయ్యిండొచ్చు!
అదనపు విపత్తులకు  ఎదురుచూడకపోవచ్చు,
కొత్త విధ్వంసాలకు,
వేలమందిని మార్చివుండోచ్చు
నరకంనుండి బతికి బట్టకట్టినవార్ని
ప్రవక్తలుగా—
ఇది రేడియో ఫోబియో నయంచేయవచ్చు
ప్రపంచాన్ని
నిర్లక్ష్యం,నిర్లజ్జ,అత్యాశ,
అధికారత్వం ఇంకా కొరవడిన ఆధ్యాత్మికత నుండి,
దాని వల్ల మనం ఒకరి పలుకుబడి  అవసరం  లేకుండా
మానవాళి నశించినది గా     మారుతాం.
(  రష్యన్  నుండి అనువాదం,లియోనిడ్ లెవిన్, ఎల్జివియత్ రిట్చ్)

(అనుసృజన- జి. సత్య శ్రీనివాస్)
Tuesday 19 May 2015 0 comments By: satyasrinivasg

అణువిస్ఫోటాలు-పర్యావరణ విధ్వంసం-33

1986 చెర్నోబిల్ అణు శక్తి కర్మాగారం నుండి వెలువడిన అణుధార్మిక వాయువు వల్ల చెర్నోబిల్ నగరం ఖాళీ చేసారు. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రమాదకర అణు విధ్వంసం ఇది. ఈ కర్మాగారంలో పనిచేసే కార్మికులకు చెర్నోబిల్ కి దూరంగా ప్రిప్యాట్ అనే ప్రత్యేక నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు చెర్నోబిల్ నగరంలో చాల కొద్ది మంది వున్నారు. వారి ఇళ్ళ పై వుండే బోర్డ్ల  పైన ఇంటి యజమాని ఇక్కడ ఉంటాడుఅని రాసి పెట్టి వుంటుంది. గతంలో  నగర జనాబా 14౦౦౦ మంది. ఇప్పుడది ఒక నిర్జీవమైన ప్రదేశం. చెర్నోబిల్ అన్నదానికి అర్ధం నల్ల గడ్డి లేదా నల్లని బాట .అవును .అణు విస్ఫోటం తర్వాత అ ప్రదేశం మానవాళి అవాసాలకి సరైన  అర్ధం గా మిగిలింది. ఐ.ఎఫ్. షుమేకర్ జర్మన్ ఆర్ధిక శాస్త్ర వేత్త, పర్యావరణ తాత్వికుడి అణు శక్తి – మోక్షమా లేక విధ్వంసమా అంటూ ఇచ్చిన వివరణ , భవిష్యత్తు  శక్తి అవసరాల కోసం ఆరాటం వల్ల మనం నిశ్చలతను  క్రమేణా కోల్పుతున్నాం.  జనాలందరూ అణు శక్తి వినియోగం అన్నది సరిగ్గా ఇదే సమయంలో వెలుగులోకి వచ్చింది అని అనుకుంటున్నారు. కొద్ది పాటి మంది కూడా ఇప్పుడు తెలిసి దాని పూర్వాపరాల గురించి అలోచించడంలేదు.ఇది కొత్తది, వినూత్నమైనది,అభ్యుదయకరమైనది,అంటూ అతి చవకగా లబిస్తుంది అని వాగ్దానాలు చేశారు.  ఇది కొత్త శక్తి మార్గం కాబట్టి  ఇప్పుడు కాకపొతే ఎప్పటికైనా అవసరం అని  వెనువెంటనే అమలులోకి తెచ్చుకున్నాం. ఇది కేవలం అణు శక్తిని వినియోగమే కాదు, ఆర్ధిక శాస్త్రం అనే మతం వల్ల వెనువెంటనే మార్పులు సృష్టిoచాలనే సిద్ధాంతాన్ని ఏర్పరుస్తుంది. ప్రశ్నించకుండా  ఆహ్వానించే పురోగతి  సంశయాస్పదమైన వరమా అన్న     ప్రామాణిక మైన వాస్తవాన్ని విస్మరిస్తుంది. వీటికి సాక్ష్యాల్ని పర్యావరణ ధృక్పధాన్ని నమ్మే వారే ఉంచుతారు.వాళ్ళుమానవాళి పై జరిగిన విధ్వంసాన్ని చూపించనంత కాలం ఇది అలా కొనసాగుతూనే వుంటుంది.
అటు వంటి సాక్ష్యమే ఈ కవిత...
ప్రిప్యాట్ కి
1.
మనం నష్టపరిహారం ఇవ్వలేము యధాస్ధితికి తేలేము
ఆ ఏప్రిల్ నాటి తప్పిదాల్ని ఘోరాల్ని.
అంతరార్ధ భారంతో వేలాడిపోతున్న   భుజాలు
జీవన వేదనను మోస్తుండాలి.
ఇది అసాధ్యమైనది, నన్ను నమ్మండి,
అధిగమించడానికి
సవరించుకోడానికి
కోల్పోయిన మన గూడు కోసం.
బాధ మన గుండె చప్పుళ్ళలో కొలువుంటుంది
భయంతో ముద్రించిన జ్ఞాపకం లా .
అక్కడ,
చేదుగుర్తులు చుట్టు ముట్టు వుంటాయి,
విస్మయంతో మన నగరం ఆడుగుతుంది:
అది మనని ప్రేమిస్తుంది కాబట్టి
అన్నింట్ని క్షమిస్తుంది,
ఎందుకు ఎప్పటికి దానిని వదిలేసాం అని ?
2.
రాత్రిప్పుడు, తప్పకుండా, మన నగరం
పూర్తిగా నిర్నిర్జీవమైనప్పటికి, మళ్ళీ జీవం పోసుకుటుంది
అక్కడ, మన కలలు మబ్బుల్లా తేలుతాయి,
వెన్నెల వెలుగుతో కిటికీలు కాంతిస్తాయి.
అక్కడ చెట్లు చెదరని జ్ఞాపకాలతో నివసిస్తాయి,
చేతి స్పర్శని మర్చిపోకండి,
వాటికి  ఎంత భాద వుందో  తెలుస్కోడానికి
వాటికి కంటూ ఏనీడ వుండదు
మండుటేoడ నుండి కాపాడుకోడానికి!
నడి రాత్రి వాటి కొమ్మలు నిశబ్దంగా కుదుపుతాయి
రగులుతున్న మన కలల్ని.
నక్షత్రాలు కిందకి జేరుతాయి
ఫుట్ పాత్  మీదకి,
పగటి వరకు కావలి కాయడానికి...
కాని గంటలు గడుస్తుంటాయి...
కలలు  వదిలేసినట్టు,
అనాధ ఇళ్ళు
వాటి కిటికీలు
వెర్రివై పోయాయి
బిగుసుకుపోయి మనకి వీడ్కోలు చెబుతాయి...
3.
మనం మన  బూడిద మీద  నిల్చున్నాం;
ఇప్పుడు సుదీర్ఘ పయనం సాగించాలి?
మనం ఎక్కడికి వెళ్ళినా భయం  రహస్యంగా    వెన్నంటే వుంటుంది
మనం అనావశ్యకులం?
కోల్పోయిన బెంగ
ముఖ్యాంశమని వెల్లడించింది
అకస్మాత్తుగా విచిత్రoగా సంతతి లేనివారమని,
విధ్వంసం  అంటే  మనకి ఇది కాదు అని చూపించింది
సృష్టించిన వారు,ఒక రోజు,
విధ్వంసానికి గురవుతారని?
... మన సముహం నుండి మనం వేలివేయబడ్డం
కటోరమైన శీతలకాలంలో...
నువ్వు, ఎగిరిపో!
కాని నువ్వు ఎగురుతునప్పుడు
నేలమీదున్న మమ్మల్ని మర్చిపోకు!
ఆనందకర దూర ప్రాంతాలకు పయనమైనప్పటికీ
నీ సంతోషకర మైన రెక్కలు నిన్ను మోస్తాయి,
తెగిపడిన మా రెక్కలు
నిర్లక్ష్యం నుండి నిన్ను కాపాడుతాయి.
(  రష్యన్  నుండి అనువాదం,లియోనిడ్ లెవిన్, ఎల్జివియత్ రిట్చ్)
(అనుసృజన- జి. సత్య శ్రీనివాస్)

ఈ కవితలో విధ్వంసం లో ఒదిగివున్న వివిధ రూపాలు కనడతాయి అలానే ప్రకృతి  పట్ల  మన సమర్ధవంతమైన నిర్లక్ష్యం.
అంతరాద్ధ  భారంతో వేలాడిపోతున్న   భుజాలు
జీవన వేదనను మోస్తుండాలి.
అవును మనకు అన్నిటికీ సాక్ష్యాలు కావాలి , మరీ ముఖ్యంగా ప్రకృతి లోని ప్రతి అణువుని మనం ఉపయోగిoచకుండా విడిచిపెట్టం కాబట్టి. ప్రతిది రాబడి కోసం ఉపయోగిస్తూ పోతూ మన అణువులోని తాత్విక ప్రేమ గుణాన్ని సైతం మనం ముడిసరుకుగా మార్చేసాం. ఇప్పుడు అభివృద్ధికి కావాల్సిన శక్తి ఇంధనం మన అణువులోని ఆ గుణాన్ని కబళించడం.ఆ గుణం నుండి మనని మనం నిర్వాశితుల్ని చేస్కోవడం . ఇప్పడు జీ.డి.పి. కి వున్న నిర్వచనం గ్రాస్ డొమెస్టిక్ ప్రాడెక్ట్ కాదు , గ్రాస్ డిస్ప్లేసిడ్ ప్రాడెక్ట్. అది  వివిధ రూపాల్లో జరుగుతుంది. అందులో మనని భూమి నుండి, భూమిని విశ్వం నుండి జరిగే ప్రక్రియలు కోకొల్లలు. ఇదే గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిక. అందుకే జీవితం జీవన వేదనను మోసే యంత్రం. ఈ యంత్రానికి ఆవాసమైన నగరం మనని అడుగుతుంది(పంక్తులు-13-16) ఎందుకు దానిని వేదిలేసాం అని. కాని  వదిలేసింది నగరాన్ని కాదు. నగరానికి అణుమాత్రం పచ్చని చోటివ్వలేని మన నాగరికాన్ని.అందుకే
మనం మన  భూడిద మీద  నిల్చున్నాం;
ఇప్పుడు సుదీర్ఘపయనం సాగించాలి?(పంక్తులు-37-38)
ఈ పయనంలో మనం సంతతిలేని వారమవుతాం(పంక్తులు-39-43).
అంతర్జాతీయ చర్చల్లో గ్లోబల్ వార్మింగ్ గురించి వున్నా ఆందోళన కంటే అణుశక్తి, అవశేషాల నుండి పొందే ఇందనం గురించి పెరుగుతున్న  గ్లోబల్ క్యాపిటలిజం పైనే  మక్కువ ఎక్కువగా వుంది.
విధ్వంసం అంటే  మనకి ఇది కాదు అని చూపించింది
సృష్టించిన వారు,ఒక రోజు,
విధ్వంసానికి గురువుతారని?(పంక్తులు-44-53 ) కవితలో ఈ ఆవేదన స్పష్టంగా  కనపడుతుంది.
బహుళ ప్రచారంలో వున్న సిద్ధాంతం ఇప్పటి వరకు క్లాస్ స్ట్రగుల్ గురించి చెప్పింది, క్లాస్ స్ట్రగుల్ లో రిసోర్స్ స్ట్రగుల్ గురించి అంతగా పట్టించుకోలేదు.
తెగిపడిన మా రెక్కలు
నిర్లక్ష్యం నుండి నిన్ను కాపాడుతాయి
ఈ తెగిపడిన రెక్కల పుణ్యామా అని దోచుకునేవాళ్ళకి శిక్షలు పడట్లేదు. కారణం ఇదంతా అభివృద్ధి మాయా జాలం. శాంతి కోసం అణు శక్తిని వినియోగిస్తాం అన్న నినాదాల వెనుక ఎంత హింస  వుందో గుర్తించడం లేదు. ప్రబలుతున్న ఆర్ధిక నియంతృత్వం కనిపించడంలేదు.అణు విచ్చేదనలో  మానవాళి మనుగడకు కలిగే ముప్పు లో పోల్చుకోలేని,నమ్మశక్యంగాని విషయాలున్నాయి అన్నది అంచనాలకు అందని లెక్క .

ఇకో క్రిటిజిజంలో కొందరి అభిప్రాయం పర్యావరణం గురించి చెప్పడంలో కవిత్వం కంటే నాన్-ఫిక్షన్ ద్వారా బాగా చెప్పగలుగుతారని, కారణం వాస్తవాల్ని తెలియచేయాలన్న ఉద్దేశ్యం అందులోనే చేయగలుగుతామని. కాని పై కవిత ఆ పరిధిని దాటింది.ఏ విషయం పైనైనా  రాయడానికి కావల్సింది కేవలం ఆ విషయం మీద  వుండే వాత్సల్యం సరిపోదు, ఆ విషయం పైన పట్టు తో బాటు, సిద్ధాంతాన్ని కవిత్వీకరణ చేయగల సామర్ధ్యం. అ  స్ధాయికి పర్యావరణ అంశం ఇంకా చేరలేదు. కారణం పర్యావరణ సిద్ధాంతాల గురించి జరగాల్సినoత అటామిక్ ఫుష్యన్ ఇంకా జరగలేదు. దీని కోసం చరిత్రని డి లర్న్ ,రి లర్న్ చేయాల్సిన అవసరం వుంది. అదే విధంగా కవిత్వాన్ని కూడా. పర్యావరణ కవిత్వం కేవలం కవిత్వం కాదు ప్రకృతి సంరక్షణ,వినియోగం, నిర్వహణకి  సంబంధించిన సిద్ధాంతం. ఇది ఇకో –నామిక్స్,
Tuesday 12 May 2015 0 comments By: satyasrinivasg

భోపాల్ రాత్రి -పర్యావరణ విధ్వంసం -32

కాల క్రమేణా కొన్ని ప్రతీకల భావన  మారుతూ పోతుంది. పరిశ్రమలకు గుర్తుగా రైస్ మిల్లులాంటి బొమ్మ పై  పొగగొట్టం అభివృద్ధికి ప్రతీకగా చాల కాలం మన్నికలో వుంది. 198౦ నుండి ఈ ప్రతికలోని పొగ గొట్టం లో నుండి వచ్చే పొగరంగు మారింది. మిగతా భాగం అంతా ఒక్కటే. పొగలోని బూడిద వర్ణం తగ్గి నలుపు రంగు పెరిగింది. ఇప్పుడు పిల్లల్ని పర్యావరణం గురించి బొమ్మలు వేయమంటే పరిశ్రమలని కాలుష్యం వెదజల్లే పొగ గొట్టాలుగా వేస్తున్నారు, పర్యావరణం,మన మనుగడ  పై దాని ప్రభావాన్ని చెపుతున్నారు.  బ్రహ్మవర్,ఉడిపి,కర్నాటక కు చెందిన 5 వ తరగతి  విద్యార్ధి రిత్విక్ బి.యం. రాసిన కవిత ఇందుకు సజీవ ఉదాహరణ  .
వదిలేయి, వదిలేయి రాక్షసుడా
(రిత్విక్ బి.యం.,5 వ తరగతి  విద్యార్ధి,బ్రహ్మవర్,ఉడిపి,కర్నాటక)

జీవితంలో కొన్ని జరుగుతాయి
కాని నువ్వు వెనక్కి వెళ్ళలేవు
నువ్వు నిర్మించిన మృత్యువు కర్మాగార్ కాలానికి ,
రాక్షాసుడా .
ఇక మంచిది నువ్వు
వదిలిపెట్టు,ఎందుకంటే
మా దేశ ప్రజలందరూ
ఇతరులు
నిన్ను వ్యతిరేకిస్తున్నారు
వేలమంది కనుమూశారు
నీవల్ల-
నీ మృత్యువు కర్మాగారం వల్ల
నీ దుర్వాసన గ్యాస్
మిధైల్  ఐసోసైనేట్
గుర్తించుకో
ఇది నీ వల్లే
కేవలం నీ వల్లే .
భోపాల్ గ్యాస్ దుర్ఘటన పై పరిశ్రమ యాజమాన్యాన్ని రాక్షసుడి గా ప్రతీకిస్తూ చాల కవితలు వచ్చాయి, అందులో అతి పిన్న వయస్కుడు రిత్విక్ కవితలో చాల పరిపక్వతతో బాటు పర్యవరణ కవిత్వంలోని ఇకో సెంట్రిక్ దృక్పధం స్పష్టంగా వుంది. పర్యావరణ కవిత్వానికి ఈ దృక్పధం చాల కీలకం. పర్యావరణ దృక్పధంలో ఆంత్ర ఫో  సెంట్రిక్ అంటే  ప్రకృతిని  విశ్వజనీన   వ్యవస్ధల ద్వారా చూడడం, బయో సెంట్రిక్ దృక్పధం అంటే మన చుట్టూ వున్న భౌతిక వ్యవస్ధల ద్వారా పరిశీలించడం. ఈ దృక్పధాలు  ప్రకృతి సహజంగా వున్నప్పుడు, సహజమైన ప్రకృతిని కాపాడేందుకు , ఉద్యమాలని , సంరక్షణ ప్రక్రియలని  ఈ ధోరణిలో రాయచ్చు, కాని పర్యావరణం విధ్యంసం అయినప్పుడు ఇకో క్రిటికల్ దృక్పధంతో  వ్యక్త పర్చాలి . దోషి ఎవడు అన్నది స్పష్టంగా పలకాలి. పర్యావరణ విద్వంసానికి కారణం వ్యక్తులు కాదు, ప్రకృతిని, ప్రకృతి వనరుల్ని ఉపాయోగించుకుంటున్న  తీరు, వాట్ని పునరావృతం కాకుండా  మృత్యు దిశ సాగే పయనాన్ని చెప్పాలి.  చాల కాలంగా భూమికోసం ,భుక్తి కోసం జరిగిన పోరాటాలలో వనరులని ఒక ఆస్తిగా పరిగణించడం వల్ల వనరుని మానవుని జీవనానికి  ముడి సరుకుగా    మానవ హక్కులు   జమకట్టాయి, కాని వనరుకి తనకంటూ ఉండే అస్ధిత్వాన్ని ఒక హక్కుగా గుర్తించలేదు. మన కంటే ముందునుండి వుండి,మన తర్వాత కూడా  కొనసాగే జీవం వున్నది,హక్కు అన్నది, ఈ జీవ ప్రయాణం అన్నది అస్తిత్వపు ఆస్తి  అన్న ఆలోచన పరిగణలో రావడానికి చాల కాలం పట్టింది. ఈ దృష్టి ఏర్పడడానికి ప్రోద్భలించిoo౦ది పర్యావరణ విధ్వంస కర సంఘటనలు. ఇది అర్ధం చేసుకునే సరికి జరగాల్సినది జరిగిపోయింది. ఇదంతా   రిత్విక్ కవితలో చాల క్లుప్తంగా  చెప్పాడు.
ప్రకృతిని ,ప్రకృతి లోని వాటి గురించి అనాదిగా చెప్పుకుంటూనే వస్త్తున్నాం, ఇవి  చెప్పటంలో వివిధ సిద్ధాంతాల  ప్రేరణతో నూ చెప్పాం, పర్యావరణ దృష్ట్యా చెప్పడంలోని  తేడా అల్లా మనం  ప్రకృతికి  కావలి దారులం ,హక్కుదార్లం  కాదు అని స్పష్టంగా చెప్పడం.ఇది సాహిత్య న్యాయానికి ఏర్పరిచే దారి అని కవి లారి అంటాడు. కవిత్వం  విలువలతో కూడిన  సాక్ష్యం అని నిర్వచిస్తారు.
 ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతితో ముడిపడిన మన నడవడిక, అనుబంధాలు ,ప్రకృతికి,ప్రకృతిలో  వీటివల్ల ఏర్పడిన వ్యవస్ధ ,ప్రకృతి ,దానితో మనం తిరిగి  ఏర్పరుచుకునే  బంధాలు ,ప్రకృతికి సంభందించి మన వాక్యాలు వ్యక్తమయ్యే తీరు పర్యావరణ సాహిత్యం, ఇవి పర్యావరణ కవిత్వం కి దిశా నిర్దేశాన్ని కల్పిస్తాయి.రొమాన్టిసిజమ్ నుండి పోస్ట్ హ్యుమనిజం కాలం వరకు జరిగిన సాహిత్య ప్రయాణాన్ని ఈ చూపుతో  పరిశీలించడం అవసరం. సాహిత్యంలో పర్యావరణ సాహిత్యం తనకంటూ    ఒక స్ధానాన్ని ఏర్పరుచుకోడానికి ఈ దిశా,నిర్దేశం  చాల కీలకం. లేకపోతే ప్రాభల్యంలో  వున్న భావజాలంలో ఇది ఒక భాగంగానో లేక అదే భావజాలం తో వచ్చిన సాహిత్యంగానో మిగిలిపోతుంది తప్ప తనకంటూ ఒక విశిష్ట స్ధానాన్ని ఏర్పరుచుకోలేదు.
ప్రకృతిని ఏవిధంగా రొమాంటిక్ గా చూశామో ,పరిశ్రమల్ని చూశాం ,అంతే స్ధాయిలో  నగరాల్నిఅంత  రొమాంటిక్ చూడ లేదు కాని అభివృద్ధికి మటుకు నగరాన్ని  పరాకాష్ట అన్న ప్రతీకగా చూపాం.
అభివృద్ధి క్రమం అంతా ప్రకృతి హక్కుల ఉల్లంఘనే,మనం ఈ భూమి నైసర్గిక స్వరుపాన్ని పూర్తిగా మార్చలేదు కాని, భూ వినియోగ స్వరూపాన్ని మార్చుకుంటూ పోతున్నాం. దానితో బాటు భూమినల్లుకున్నభూతల  స్వారూప్యాన్ని కూడా,  మారిపోతున్న ఈ స్వరూపం మన కళ్ళ ముందే  జరుగుతున్నా  అర్ధం అవ్వడానికి చాల కాలం పట్టింది. అర్ధం అయినా  మనం పూర్వపు స్ధితిని తిరిగి తీసుకు రాలేం, ఇక ముందు  ఇంకా దుర్భరం అవ్వకుండా తగిన జాగ్రత్త పడాలి.ఇది తెలిసి,ఒక్కోసారి తెలియకుండానో ,అనుభవ  పుర్వకంగానో  రాస్తాం. ఇవి రాస్తునప్పుడు ఒకటి మాత్రం స్పష్టం మనం ఒక స్టాన్స్ తీసుకుంటాం. అది పొలిటికల్ కూడా. అది హక్కు అన్న విషయానికి ఇచ్చే పున: నిర్వచనం.ఇది ఇకో కవుల నైజం.
పూర్వం  నుండి వున్న మౌఖిక వ్యక్తీకరణ ద్వారా ప్రకృతికి  ,మనిషి మనుగడకి వున్న  సంబంధాన్ని చెప్పింది అని ఇకో కలాజికల్ సైన్స్  వ్యక్త పరుస్తుంది.. నాటు వైద్యంలో ఆది మానవులు ,చెక్క వైద్యులు మనుషులకి రోగం వచ్చినప్పుడు,ప్రకృతి విధ్వంసం జరిగినప్పుడు దానిని ప్రకృతి సమతుల్యత జరిగినట్టు భావించి ఆట,పాటల ద్వారా నివారణ చర్యలు చేపట్టే వారు.ఇది ఇకో సెంట్రిజం.ఇప్పటికీ కొన్ని వేలమంది శ్యామంస్ ఈ ఆచారాన్ని పాటిస్తారు. మరి యూనియన్ కార్బైడ్ విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని ఏవిధంగా తీరుస్తాం .  ఆ గాలి , గాలిలో కలిసిపోయిన జ్ఞాపకాల్ని ఎలా భర్తీ చేస్తాం! ఎన్ని గాయాల్ని పూడుస్తాం...
"భోపాల్ దర్శనం"
(అనూషా చంద్రశేకరన్)
మృత్యు హస్తం
మెల్లిగా ముందుకు  సాగుతుంది
పుట్టుక  కోసం ఎదురుచూస్తున్న పసికందుని దొంగలించడానికి.
నైపుణ్యమున్న కరుడుగట్టిన మృత్యు హస్తం;
గాయపర్చే, గుడ్డిచేసే ,గడ్డకట్టించే  ఆ  స్పర్శ
వెన్నపూసలో చలి పుట్టిస్తుంది.
అమాయకులు అభద్రతతో, అసురక్షితంగా   పడివున్నారు.
భయానక పొగ కమ్ముకుంటోంది,
మెడచుట్టూ వున్న సుతి మెత్తన్ని చర్మాన్ని పిసికేస్తోంది,
భయంతో వున్నమొహమంతా మసిచేస్తూ
శ్వాసకోశ లోని గాలిని చుట్టు ముడుతూ
ప్రాణాన్ని మెల్లిగా ,నొప్పిగా జుర్రుకుంటూ.
వాళ్ళు పోరాడుతున్నారు, తిరగబడుతున్నారు, వదిలి పెట్టరు
గర్భసంచిలో మృతి చెందిన పసికందులా
పశువులకి,విషగాలి దాణా.
పురుషులు,స్త్రీలు ఇంకా పిల్లలు,
కొందరి అత్యాశకు బలైయ్యారు...
మరికొందరి  నిర్లక్ష్య వైఖరికి.
ఎదుగుతున్న నగరం నుండి జీవితాన్ని లాక్కు పోతుంది
తెరచుకున్న కళ్ళు , మూతి నుండి
మానవాళి అభివృద్ధిలో మూగ సాక్షిగా నిల్చుండి
ఇంతలో మరో బాధితుడ్ని విషగాలి కబళిస్తూ
భోపాల్ దర్శనం:
భీబత్సం  చనిపోయిన వారితో చనిపోదు
బతికున్న వార్ని వెంటాడుతూ వుంటుంది
అత్యాశ మనుషుల పురోగతిని హెచ్చరిస్తూ
(అనుసృజన-జి.సత్యశ్రీనివాస్)

భోపాల్ రాత్రి మన కళ్ళల్లో కనుపాపై కూర్చుంది. మనం ఏది చూసినా, ఎదుటి వారు మనల్ని చూసినా  అదే బొమ్మ. ప్రతీక అర్ధం మారింది. ప్రతీక ఒక మ్యాట్రిక్స్ (మాధ్యమం) మాత్రమే కనుపాపలోని తళుక్కు పొగగొట్టం చూరులో పేరుకు పోయిన మసి.
Tuesday 5 May 2015 0 comments By: satyasrinivasg

భోపాల్ రాత్రి -పర్యావరణ విధ్వంసం -31

డిసెంబర్  3,1984,రాత్రి 11.30 గంటలు .అప్పుడే యూనియన్ కార్బైడ్ కంపెనీలో సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడం మొదలైంది. రాత్రి ఒంటిగoటకు ఆదమర్చి నిద్రపోతున్న వాళ్ళు దగ్గుతూ లేవడం మొదలెట్టారు, అలా లేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతోంది. బాధని తట్టుకోలేక ఆస్పత్రి వైపు పరుగులు తీసారు, ఓపికున్న వాళ్ళు ఆసుపత్రి చేరారు, లేని వాళ్ళు దారిలోనే తుదిశ్వాస విడిచారు. ఈ  గ్యాస్ పిడితులు తమకు న్యాయం జరగాలని కోర్టు దారి పట్టారు. ఆ దారి రహదారి కాదు,30 ఏళ్లుగా ఆ ప్రయాణం కొనసాగుతూనే వుంది. ఆ ప్రయాణాన్ని అడయరనుమోన్ తన కవిత ద్వారా చిత్రించారు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన పైన కవిత-సుప్రీం కోర్టు
అడయరనుమోన్  మొదలెట్టిన చర్చ
భోపాల్
విస్తృతమైన సమాచారాన్ని సమీక్షుతున్నాను,
విధ్వంసానికి సంబంధించిoది  అది భోపాల్,
అది చదివే అవకాశం నాకు లభించింది,
...చాల కోర్టు తీర్పులని,
సుప్రీం  కోర్టు తీర్పులు కుడా,
హైకోర్టు, జిల్లా కోర్టు,
ఇంకా  అమెరికా జస్టిక్ కీనన్ వి,
ఈ తీర్పులన్నీ ఎలావుండాలో అలానే వున్నాయి,
ఇవన్నీ విధ్వంస కారకాల్నిసమర్ధిస్తూ ,
ప్రతి తీర్పు సుదీర్ఘమైనది, విస్తృత కాలం పట్టినవి ,
అన్నీ సమస్య లోతుల్లోకి వెళ్ళినవే
ప్రతిదీ సమస్యని చట్ట పరంగా పరిశీలించినవీను,
ఆవి ఊక నుండి గింజని  విడదీశాయి,
తీర్పులన్నీ అద్భుతం, గొప్పవి,
భోపాల్ జిల్లా కోర్టు తీర్పు,
మధ్యంతర పరిహారం చెల్లించాలన్న ఉత్తర్వునిచ్చింది,
భోపాల్ హై కోర్టు కూడా,
దీని వల్ల మధ్యంతర పరిహారం  వంద కోట్లకి కుంచించుకుపోతుంది,
దీనినే మళ్ళీ సుప్రీం కోర్టు చెప్పొచ్చు,
ఇది  సమస్యకి  దీర్ఘ కాల ముగింపు పలకొచ్చు ,
ఇది యూనియన్ కార్బైడ్ ని నష్టపరిహారం కట్టమని ఉత్తర్వు అవ్వచ్చు,
ఇదంతా నష్టానికి బాధ్యులైన వార్ని రుణ విముక్తుల్ని చేస్తుంది,
ఇది సివిల్ అయినా క్రిమినల్ అయినా,
దీనికంటే ముందు జస్టిస్ కినన్ తీర్పు,
ఎవరైతే అమెరికా చట్టాన్ని విశ్లేషిస్తారో,  
అమెరికా దీనికి సరయిన ప్రదేశం కాదని ప్రకటిస్తారో,
కేసు మళ్ళీ భారతీయ కోర్టులకి చేరుతుంది,
ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు విస్మరించాలి,
భోపాల్  లయబిల్టి చట్టం ఆమోదం  అవ్వడాన్ని,
బాధితులందరి బాధ్యతలని స్వీకరించడాన్ని,
కోర్టులో  కేసులు వేయడం, వాదనలని,
వాటికయ్యే ఖర్చులని   తీసుకోకుండా వుండడం.
ఆ తర్వాత మరిన్ని తీర్పులు,
క్రిమినల్ బాధ్యతల ఉత్తర్వులను కొట్టిపారేస్తున్నట్టు,
లేక క్రిమినల్ బాధ్యతలను కేవలం కొన్ని క్రిమినల్ సెక్షన్స్ కి పరిమితిస్తున్నట్టు,
లేక రివ్యూ పెటిషన్ ఉత్తర్వుకి సంబంధించినట్టు,
లేక చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ తీర్పుకి ,
ఎనిమిది మంది ముద్దాయిలకి రెండేళ్ళ శిక్ష ఖరారు చేస్తూ,
ఈ మధ్య కాలంలో  తొమ్మిదో వాడు చనిపోయాడు,
ఈ  నివేదికలన్నిటినీ చదవడం గొప్ప పని ,
ఇంక చట్టంలోని మూలాల్ని అర్ధంచేసుకోవడం,
ఇంకా చట్టాల్ని వాటి దృక్పధాల్ని,
అవును, ఎంతో నేర్చువాల్సింది, అర్ధంచేసుకోవాల్సింది వుంది.

నేను  సమాధానాలని అన్వేషిస్తున్నాను
నా మదిలో వుండే కొన్ని ప్రశ్నలకి,
కాని, ఒక దానికి మటుకు ఖచ్చితమైన సమాధానం దొరికింది,
అదేంటంటే  నేను బస్ మిస్ అయ్యాను,
నేను అమెరికా లో జన్మించని కాలం,
ఎందుకంటే ఎంత మొరపెట్టుకున్నా,
మానవ హక్కులు  ,మానవ జాతి గౌరవం గురించి,
ఇంకా ప్రపంచ మానవ హక్కుల ప్రకటన,
ఇంకా  విస్తారమైన ఐక్య రాజ్య సమితి ఒప్పందాలు,
అసలు నిజం ఏంటంటే,
తూర్పు,తూర్పే, పడమర పడమరే,
ఇవి ఎప్పటికీ ఒకే తీరులో ఆలోచించవు,
ఎప్పటికీ కలవవు,
సమానత్వం అన్న వేదిక  పైన,
అందుకే నువ్వు భారత దేశంలో జన్మిస్తే,
నువ్వు  భారతీయుడిగానే చావాలి,
చచ్చిన తర్వాత కూడా అలానే  మిగులుతావు,
చివరిలో ఒక భారతీయుడిగా,
ఎవరి బతుకునైతే  నష్టపరిహారంతో భర్తీ చేయాలో,
క్రమాంకన చేసే స్ధాయిలో,
ఈ నిష్పత్తి   ,
దేశ  జీడిపి కి తగినట్టుగా  వుండాలి,
ఇంకా  అమెరికా కి కూడా,
అందుకే ఇది పచ్చి నిజం,
నేనెప్పటికీ మర్చిపోను.

అండర్సన్ ఇంకా మహేంద్రా
మననందరికీ తెలుసు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన ప్రధాన నిందితుడు,
ఎవరో కాదు అండర్సన్,
... పూర్తి పేరు వారెన్ మార్టెన్ అండర్సన్  ,
ముఖ్యమైన సహకారుడు కేషుబ్,
ఇప్పుడు శిక్షార్హుడైన ఒకడు,
రెండేళ్ళ  ఖైదు,
మరొకరు  తప్పించుకుని తిరుగుతున్న  నేరస్ద్తుడు,
యు ఎస్ ఎ లోనే దాక్కున్నాడు.
తెలుస్కోడానికి కుతూహలంగాను      
చాల బాధాకరంగా వుంటుంది,
అదే అండర్సన్
వలస పోయిన ఒక స్వీడిష్  వ్యక్తి కుమారుడు,
ఎదగాలని అమెరికాకి వచ్చినతను,
అతను ఒక చిన్న సేల్స్ మ్యాన్ గా జీవితం మొదలెట్టాడు,
గొప్ప చదువులు నేర్చుకోలేదు,
చెప్పుకో దగ్గ గతం లేదు,
కసి, పట్టుదల ఇంకా ఆశయం తప్ప,
జీవితంలో తనంటూ  తను నిరూపించుకోవాలని,
ఇది  అతను నిస్సంకోచంగా  నెరవేర్చుకున్నాడు,
ఆయన యూనియన్ కార్బైడ్ కి చైర్మెన్ అయినప్పుడు,
ప్రపంచంలో అతి పెద్ద మూడవ  కంపెని,
ఇప్పటికీ  అదే మాట చెపుతాడు,
తను నైతిక విలువల్ని   నమ్ముతానని,
నిజాయితీని శ్రద్ధ పాటిస్తానని,

మహేంద్ర విషయంలో ఏమీ తేడా లేదు,
ఆయన కంపెని గురించి చెప్పే విషయాలలో,
ఆయన  ఇతరులకు సహాయ పరుడని
కార్పొరేట్  పాలనా వ్యవస్థకి పునః నిర్వచనం ఇచ్చాడని
నిధులని సమర్ధవంతంగా సమకూర్చాడని
సామాజిక రంగంలో.
ఆయన గురించిన దాంట్లో వ్యక్త పర్చుకున్నాడు
ఆయన అన్నిటిలో ఎల్లప్పుడూ
భారత దేశంలో నైతిక విలువలున్న కార్పరేట్ వ్యవస్థని స్థాపించాడని.

ఇవి ఇరువురికి సంబంధించిన వాస్తవాలు
అన్నీ పచ్చి నిజాలై ఉండొచ్చు
కానీ కాలం వచ్చినప్పుడు,
వార్ని పరీక్షించే ఘడియలు చేరినప్పుడు,
వారు నిరుపించుకున్నది
మామూలు అడుగుజాడలే,
లేక  మేము అందరి లానే అని,
సగటు మనుషులమే అని,
పెద్ద మాటలతో


ఈ పొడి మాటలు ధరిత్రిని  కళంకం చేసే ఘటనలు