Wednesday 29 June 2022 0 comments By: satyasrinivasg

నిశ్శబ్ద విప్లవం- రేచెల్ కార్సన్

 

అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త ,ప్రకృతి స౦రక్షురాలు అయిన తెర్రి టెంపెస్ట్ విలియమ్స్ అంటుంది, నేను రేచల్ కార్సన్  కాంక్షని జ్ఞాపకం చేసుకుంటాను, నేను ఏకకాలంలో ఉద్రేకంగాను, కారుణ్యంతో ఉండాలనుకుంటాను. సమాజంలో చొచ్చుకుపోయిన నిర్లక్ష్యాన్ని పెకిలించడానికి నాలో రౌద్రం  నింపుకోవాలనుకుంటాను. దానిని పవిత్రమైన రౌద్రం అనుకోండి,అది సమస్త జీవరాశి కలిసి సహజీవనం చేయాలన్న జ్ఞానం. నాకు వన్య జీవుల్లో  వుండే నిశ్చల .నిరంతరమైన ,సుస్ధిరమైన ఆశని పొందాలని వుంది. ప్రకృతి రచయితలందరూ రేచల్ వల్ల వాళ్ళ పైన , పర్యావరణ ఉద్యమం పైన ఏర్పడిన ప్రభావాన్ని ప్రస్తావించడం మటుకు మర్చిపోరు.

రేచల్ కార్సన్ అమెరికన్ మెరైన్ బయోలజిస్ట్.  1907 లో జన్మించి  1964 లో మరణించింది. ఆమె రాసిన సిలేట్ స్ప్రింగ్ ప్రపంచ పర్యావరణ దృక్పధాన్ని మార్చేసింది. జిల్ లిపోఎర్  మాటల్లో ఆమె తన జీవితం చివరి  అంకంలో రాసిన పుస్తకం చిరస్ధాయిగా వుండిపోతుంది.అంతకు మునుపు ఆమె తనని తాను సముద్రపు కవి గా భావించేది.

రేచల్ కార్సన్  ఒక సారి “నా కంటూ పలుకుబడి వుంటే, పిల్లలకు నామకరణం చేసే అద్భుత వ్యక్తులతో ఒక మాట చెప్తాను, ప్రపంచంలోని పిల్లలందరిలోను వుండే అద్భుత భావన ఎప్పటికీ అంతరించకుండా  వుండే వరం ఇవ్వు అని”

ఆమె అండర్ ది సీ లో అన్న వాక్యాలు చిరస్మరణీయం.నీటి ప్రపంచంలోని జీవరాశుల చూపుని అర్ధం చేస్కోడానికి ముందుగా మనకున్న  మట్టి మనుషుల టైం, స్పేస్, స్ధలం ప్రమాణాలతో వున్న కుంచించుకు పోయిన  ఆలోచనల్ని త్యజించి, విస్తారమైన నీటి ప్రపంచoలోకి దూకాలి. సముద్ర పిల్లలకి వాళ్ళ ప్రపంచంలోని ధృవీకరణ కంటే మరొకటి ముఖ్యమంటూ ఏమీ లేదు. అవును ఆ కదిలే ప్రపంచం అర్ధం కాకే మనం మనకి మన పిల్లలకి చెప్పేదల్లా ఈ  నేల ఎక్కడికీ  కదలకుండా ఎప్పటికీ  ఇక్కడే నిలకడగా వుంటుంది అన్న పచ్చి అబద్ధం. ఈ అబద్ధం వల్ల నేడు మననుండి పుట్టిన వ్యర్ధ ఆలోచనల్ని నీటిలో కలిపి నదుల్ని, సముద్రాల్ని కలిషితం చేశాం. ఎందుకంటే నేల , నీరు, నింగి అన్నీ వేరు వేరు అని. కాని ఇవన్నీ ఒకే జీవవేరుతో ముడిపడి వున్నాయి అని కార్సన్ చెప్పింది. 1929 లో ఆమె  గ్రాడ్యుయేషన్లో ఆమె తన చదువుని సాహిత్యం నుండి భౌతిక శాస్త్రం లోకి మార్చుకుంది. అప్పుడు శాస్త్రీయ విద్యాభ్యాసం చేసే స్త్రీలు అతి తక్కువ. ఆమె కేవలం భౌతిక శాత్రం మాత్రమే చదువలేదు, మనకి వుండే భౌతిక ఆలోచనల్ని కూడా చదివింది. ‘ప్రకృతిని ఆధీనంలో పెట్టుకోవడం అన్నది మనిషి సౌలభ్యం కోసం  నియాండ్ డర్తల్  కాలం నాటి భౌతిక శాస్త్రం ఆలోచన’ అంటుంది  రేచల్ కార్సన్. రేచల్ కి వుండే లిరికల్ ప్రోస్ ,శాస్త్రీయ దృక్పధం వల్ల 1951 వల్ల అచ్చయిన  సీ అరౌండ్ అజ్ అన్న పుస్తకానికి ఆమెకి అంతర్జాతీయంగా విస్త్రుత గుర్తింపు లభించింది.1941 లో  అండర్ ది సి విండ్ పుస్తకం రాసింది. కార్సన్ మనని విచక్షణారహితంగా సముద్ర  జలాల్లో  వేస్తున్న అణు విసర్జన గురించి హెచ్చరించింది.అంతే కాదు దీని వల్ల ఏర్పడే వాతావరణ మార్పుల గురించి చెప్పింది. నేడు కాలుష్యం, వ్యవసాయంలో  విపరీతమైన రసాయనిక మందుల వాడకం గురించి వెలువెత్తిన  నినాదాలు, ఉద్యమాల వెనుక వున్న ఆలోచన రేచల్ కార్సన్. దురదృష్టం ఏంటంటే ఆమెని మాత్రం గుర్తుoచుకోము. కారణం మనం మొదట ఈత నేర్చుకున్న  ఉమ్మి నీటి కొలను నుండి నేల మీద కాలు మోపిన వాళ్ళం. మర్చిపోవడం సహజంగా కొనితెచ్చుకున్న వాళ్ళం, ఇక కృతజ్ఞత గురించి ఏమి ఆలోచిస్తాం. అందుకే నేను ఈ మాట చెబుతాను పిల్లలకి మంచిని మర్చిపోకుండా వుండే అద్భుత శక్తిని ఇవ్వమని. నీరు, నింగి, నేల వేరు కాదని అది పేగు సంబంధమని.

రేచల్ కార్సన్  మనకి కవిత్వానికి ,ప్రకృతి సౌందర్యానికి గల సంబంధాన్ని చూపించిన వ్యక్తి. సైలెంట్ స్ప్రింగ్ పుస్తకంలో వున్న వాక్యాలు...

మనిషికి ముందు చూపు,విపత్తులను ఆపే శక్తి సామర్ద్యాలు కోల్పోయాడు.  ఈ భూమిని నాశనం చేస్తూ తనని తానూ నాశనం చేస్కుంటాడు. కీట్స్ మాటల్లో... చెరువులోని గడ్డి పూలు మాయమైపోయాయి, ఇక పక్షులు పాటలు పాడవు.

 ఆమె సైలెంట్ స్ప్రింగ్ పుస్తకం లో అన్న మాట  నాకు పరిచయం లేని వాళ్ళెందరో మొదటిగా ఈ దుష్పరిణామాల గురించి ప్రస్తావించారు, మనిషి తనతో బాటు ఈ దుష్పరిణామాల్ని సమస్త జీవరాసులతో పంచుకుంటున్నాడు.  కొందరు  దీని పై నినాదాలు చేస్తున్నారు, పోరాడుతున్నారు. ఈ చిన్న చిన్న పోరాటాలు  మనకు మంచిని, మన౦ సమస్త జీవరాశుల్లో ఒకరిమని కొద్దిపాటి ఇంకిత జ్ఞానాన్ని కలిగిస్తాయి అన్న ఆశ. అవును ఈ ఆశ  కోసం ఇంకా పోరాటాలు కొనసాగుతూనే ఉనాయి. కొద్ది పాటి ఇంకిత జ్ఞానం  చాలదు, చాలా ఎక్కువ కావాలి, కారణం  మనం అభివృద్ధి ప్రయాణంలో  చాల ఇంకిత జ్ఞానాన్ని నీళ్ళల్లో వదిలేసి చేతులు శుభ్రపర్చుకున్నాం. అందుకే ఇప్పుడు చేతులు శుభ్రపర్చుకున్తున్నాం. ఇలా శుభ్రపర్చుకుంటూ నీళ్ళల్లో మరొక్కసారి మళ్ళీ పునర్జన్మిద్దాం....

సముద్రంలో పునర్జన్మ

లౌర పుర్డి సలాస్

నా పునర్జన్మని దర్శించాను- సముద్రంలో-

ఎగిసి పడుతున్న వెండి కెరటాల ప్రపంచంలో

 ఎక్కడైతే ఉప్పు,నక్షత్రాలు, మనస్సు స్వేచ్చగా విహరిస్తుందో!

నన్ను నేను దర్శించుకున్నాను, సముద్రంలో పునర్జన్మించాను

నా నుండి నా పాత ఆలోచనలు కొట్టుకుపోయాయి

నా గమ్యం అలలలో విచ్చుకుంది

నన్ను నేను దర్శించుకున్నాను, సముద్రంలో పునర్జన్మించాను

ఎగిసి పడుతున్న వెండి కెరటాల ప్రపంచంలో

 

మౌన వసంతం

ఈ నేల కదలలేని బలహీనురాలుగా కనిపిస్తుంది. నేల కదలిక మన అడుగులకు, మన చర్యలకు తెలియదు. మనం తినే ఆహారం, చర్యలు, బతుకు తెరువు, జీవనం అంతా దాని కదలిక పుణ్యమే. మనని అంతర్గతంగా .బహిర్గతంగా వలసకు పంపేది ఆ నేలే! అది మనకు అర్ధం కాక  నేలను బలహీనురాలుగా భావించి , దాని పౌష్టికత  పెంచడానికి నానా రకాల క్రిమిసంహారక మందులు జల్లి ఆ మందులని  ఆహార పదార్ధాలుగా  మార్చి తింటాం. నేల బాష మనకు తెలియదు కనుక. ఆ నేల బాషను అర్ధం చేస్కున్న వ్యకి. రేచెల్ కార్సన్. నేలలో జీవించే అసంఖ్యాక జీవులు కళ్ళకు  కనిపించవు. ఎందుకంటే మన అడుగులకు అంధత్వం సోకింది. మన కాళ్ళకి చెప్పులున్నట్టు, అడుగులకి కళ్ళజోళ్ళు అవసరం అని చెప్పింది కార్సన్. చేలల్లో  చీడ పురుగులను క్రిమిసంహారక మందుల ద్వారా వాట్ని చంపి ప్రకృతిలో  వున్న ప్రే అండ్ ప్రిడేటర్ సంబంధాల్ని నాశనం చేస్తూ ఒకటి మర్చిపోతాం వి ఆర్  ద అల్టిమేట్ ప్రిడేటర్స్ అని. చావుని కొని తెచ్చుకోవడం అంటే ఇదే.

వ్యవసాయాన్ని జీవన సంస్కృతి లా కాక వ్యాపార ధోరణిని బట్టి. వ్యవసాయదారులను ఉత్పత్తి దారులా కాక ఉత్పత్తి వినియోగదారులా మార్చిన వ్యాపార వలసవాదుల పంజరంలో  చిక్కుకున్న వాళ్ళం . చిన్న సమాజాలని వదిలి ఒంటరితనంతో సహజీవనం చేసే స్ధాయికి అభివృద్ధి చెందాం. ఇట్స్ ఆల్ ఎ వే టు వర్చ్యువల్ ఎంగేజిమేంట్. మనకి వసంతం మౌన గీతం గానే వుంటుంది.శిశిరంలో  రాలే ఆకుల సవ్వడి వినడం ,చూడడం కోల్పోయిన వాళ్ళం. శిశిరంలో

రాలే ఆకులు...

ముంగిట్లో రాలిన ఎండుటాకుల్ని, ఉషోదయ

సంధ్యా కాలాల్లో

ఆమె శుభ్రపరుస్తూనే వుంటుంది

అలిగి వెళ్ళిన వాళ్ళు ఇల్లు వదల్లేక

అక్కడే తచ్చాడుతున్నట్లు

మళ్ళీ తొలి కిరణాల్లా

అవి ముంగిట్లో వాలుతూనే వుంటాయి

ఎండుటాకుల వాకిలి

మట్టి రేణువుల పట్టీల తరంగం.

( ఎండుటాకుల వాకిలి నుండి కొన్ని పంక్తులు, ఇంకా సగం  సీక్వెల్, జి.సత్యశ్రీనివాస్)

 

మనం  కూడా ఎండుటాకులా  రాలి అక్కడే తచ్చాడుతూ మట్టిలో కలిసి జాతక కధలా మళ్ళీ రూపాంతరం చెందుతాం. ప్రకృతి లోని, స్త్రీలలోని రుతుచక్రాన్ని అర్ధం చేస్కోలేనప్పుడు మనం ప్రకృతి రంగుల్లో అల్లుకుపోలేం. నిరెంద్రియ (ఇనార్గానిక్) జీవనంలో సేంద్రియ ఊసులు చెప్పుకు౦టూనే వుంటాం. బీజ క్షేత్రాల్ని నిర్జీవం చేస్తూనే పోతాం. అందుకే  మన చూపుకు  కించిత్  పచ్చటి లేహ్యం అద్దిన కార్సన్ చూపుడు వేలుని అంటిపట్టుకుని నడవడం అవసరం.

1960చివరి సంవత్సరాలలో ఒక సారి వైల్డ్ లైఫ్ ఫండ్ డిన్నర్ పార్టీ లో నెథర్లాండ్స్ ప్రిన్స్ బెర్న్హార్డ్  మాటలు... ‘మనం స్పేస్ని జయించాలని కలలు కంటున్నాం. ఇప్పటికే చంద్ర మండలానికి వెళ్ళే ప్రయత్నాలు మొదలు పెట్టాం. కాని మన గ్రహాన్ని  ఉపయోగిస్తున్నట్టే , మనం మార్స్, వీనస్,మూన్ ని  వుపయోగించాలనుకుంటే,  వాటి మానాన వాట్ని వదిలేడం ఉత్తమం. మన నగరాల్ని గాలి కాలుష్య  కేంద్రాలుగా, నదులు, సముద్రాల్ని  కలుషితం చేశాం. మన నేలని సైతం విషపూరితం చేశాం”.

 ఇదే మాదిరి మాటలని నీల్ ఆర్మ్ స్త్రాంగ్ కి ,బుస్స్ ఆల్డ్రిన్ కి ఒక నేటివ్ అమెరికన్ చెప్పాడు. వాళ్ళు 20 జులై 1969న అపోలో  II   ద్వారా చంద్రమండలం లోకి అడుగుపెట్టే ముందు, పశ్చిమ అమెరికా లోని చంద్ర మండలం లాంటి ఒక ఎడారి  ప్రాంతంలో   నేటివ్ అమెరికన్ నివాస ప్రాంతంలో శిక్షణ పొందుతున్నప్పుడు జరిగిన సంఘటన. ఒక రోజు అక్కడి ఒక నేటివ్ అమెరికన్ వచ్చి వాళ్ళను  మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడిగాడు. వాళ్ళు దానికి సమాధానంగా మేము  ఒక పరిశోధన నిమిత్తం చంద్ర మండలానికి వెళుతున్నాం ,దానికి కావాల్సిన శిక్షణ ఇక్కడ పొందుతున్నాం అని చెప్పారు. అది విని ఆ పెద్దాయన కొంచం సేపు నిశబ్దంగా  వున్నాడు. వాళ్ళు అతన్ని నువ్వు ఎందుకు మాట్లడం లేదు అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, ఏమీ లేదు, మా తెగ వాళ్ళకు ఒక నమ్మకం వుంది. అది మా పూర్వీకుల ఆత్మలు చంద్రుడిలో వుంటాయని. మీరు నాకు సహాయం చేస్తారమోనని చిన్న ఆశ, అంతే! ఏమిటి  అని అతడిని  అడిగారు , అబ్బే ఏమీ లేదు, మా వాళ్ళకి ఒక సమాచారం అందించాలి అంతే!. సరే ఆ సమాచారం ఏంటి అని అడిగారు. దానికి బదులుగా ఆయన వాళ్ళ బాషలో అది చెప్పి , నీల్ ని ,బుస్సుని అది కంఠస్ధం వచ్చేవరకు  నేర్చుకునేటట్టు చేశాడు. వాళ్ళు దాని అర్ధం అడిగితే ఇది మా గూడెం వాళ్ళ రహస్యం ఎవరికీ చెప్పం అని వెళ్ళు పోతూ, తిరిగి చూసి ఇది మీరు చెప్పడం  మాత్రం  మర్చిపోకండి, ఆ, బాగా కంఠస్ధం  చెయ్యండి, మర్చి పోకండి అని వెళ్ళిపోయాడు. వాళ్ళు  తిరిగి వాళ్ళ క్యాంప్ కి  వచ్చి , ఈ బాష తెల్సిన వ్యక్తి కోసం వెతికి పట్టుకున్నారు. అది అతనికి చెప్పి అర్ధం చెప్పమన్నారు. అది విని ఆ గూడెం, మనిషి విరగ బడి చాలా సేపు నవ్వాడు, అలా నవ్వుతూనే వున్నాడు. ఇక ఓపిక నశించి అతన్ని గట్టిగా పట్టుకుని అడిగారు. అప్పుడు అతను దాని అర్ధం చెప్పాడు. ‘వీళ్ళు చెప్పే ఒక్క మాట కూడా నమ్మద్దు, వీళ్ళు మీ భూముల్ని లాక్కోడానికి వచ్చారు!’

అవును మనం వున్న నేలను నాశనం చేసి వేరే గ్రహాలకి వెళ్ళేది ఇందుకే అని ఇప్పటికి తెల్సింది. అదే నేటి స్పేస్ కలోనైజేషన్.

 మన నేలని, సముద్రాల్ని , ఇతర గ్రహాలని ఇలా దోచుకుంటూ, నాశనం చేస్తూ పోకూడదనే రేచల్  జీవితాంతం చేసి,రాసి చూపించింది. అది నేల నింగి, నీరు కలిసే ప్రదేశం నుండి వచ్చిన ఆకు పచ్చని అలల వసంత సవ్వడి. ఆ సవ్వడి ,  స్త్రీ , ప్రకృతి ఋతువుల మధ్యనున్న గురుత్వాకరణ శక్తి. అది ప్రకృతి   బాష . అది అర్ధం అయితే మనం పలికే పలుకుల కంటే గొప్ప పచ్చటి కవిత్వం వుండదు.అదే ప్రకృతి కవిత్వ రసవాదం.

పెను మార్పు(రేచెల్ కర్సన్ కి )-లౌర పుర్డి సలాస్

ప్రియమైన  సముద్రం

అందరూ మనని అనుకున్నారు, మనం వేసవి గాడ్పులమని

నాకు అప్పుడు 22 సంవత్సరాలు మాత్రమే

నువ్వు... పెద్ద దానివి

కాని నాకు తెల్సు- నాకు తెల్సు - నువ్వు నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తావని

నాకు ఎప్పటికీ బ్లాక్ చెర్రి,హెమ్ లాక్ చెట్లు, జింకలు

తాబేళ్ళు, ధూళి ఇంకా గొడవ పడడం అంటే ఇష్టం

నాకు ఎప్పటికీ ఇష్టం కాగితాల్లో ఒరుసుకు పోయిన చెక్క పెన్సిల్ .

పరిగెడుతున్న ఆలోచనలు

వీక్షణం, రాయడం

ప్రపంచం, పదాలు.

ఇంకా కొనసాగిస్తున్నాను

కాని అవి నీతో సరితూగవు

నీ వెండి కళ్ళు, నీ అలల కేశాలు

మెరిసే చేపలు

ఇంకా మెల్లటి  అలలు

నీతో వున్నపుడు నక్షత్రాలు ఇంకా జ్వలంగా మెరుస్తాయి

దయచేసి నా వేళ్ళ కొసలనుండి  జారిపోయి ,కనిపించకుండా పోకు

నా జీవితాంతం నీ కోసం పోరాడుతా , నా సముద్రమా,

నిన్ను ప్రేమించే

రేచల్  కార్సన్

(అనుసృజన జి.సత్యశ్రీనివాస్)

దయచేసి నా వేళ్ళ కొసలనుండి  జారిపోయి ,కనిపించకుండా పోకు,

అవును దయచేసి నా వేళ్ళ కొసలనుండి  జారిపోయి ,కనిపించకుండా పోకు,

పొతే జీవితం ప్రాణం లేని  శ్వాస  లా,  మట్టి  నేలగందం లేని తడిలా మిగిలిపోతుంది...

 

 


Thursday 27 May 2021 0 comments By: satyasrinivasg

ఎంతెంత దూరం,జాయిస్ కిల్మర్

 


ఇప్పటి వరకు చెట్లు నాటడంలో వుండే సాధక బాధలు చూశా౦. ఇక అడవుల సంరక్షణ గురించి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలి.  చిన్నప్పుడు విన్న పాట ఎందుకో అడవుల సంరక్షణ విషయ౦లో బాగా జ్ఞాపకం వస్తుంది. అది

oతె౦త దూరం ,కోసిడి కోసిడి దూరం... ఈ పాట చాల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, గెంతో దూరం లేదు, ఇంకొ౦చమే అని ఉత్సాహ పర్చడానికి చెప్పే పాట. అదే విధంగా అడవుల్లో, పల్లెల్లో తిరుగుతున్నప్పుడు , మనం చేరాల్సిన ప్రాంతం దూరం అయినప్పటికీ ,అది ఎంత దూరం అని వారిని అడిగినప్పుడు అరె! దూరం లేదు,  ఇదే దారిలో ఇంకొంచం వెళ్ళి కుడి .వైపు తిరిగి మళ్ళీ ఎడమ వైపు తిరిగి సక్కంగా పోతే అక్కడ ఒక చింత చెట్టు కనపడతది అక్కడి నుండి ఇంకో నాల్గు అడుగులెయ్యాలి అంతే, అక్కడే. చాలా సులువుగా ఎంత దూర మైనా దగ్గర వున్నట్టే చెబుతారు. కొత్తవాళ్ళు ఆ దగ్గరిని చేరడానికి మధ్యలో చాల మందిని మళ్ళీ  మళ్ళీ అడిగి తెలుసుకుని వెళుతూ వుంటారు.

ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ దూరాన్ని దగ్గరగా చెప్పే వాళ్ళకి,  నడకే అలవాటు లేని వాళ్ళు కొత్తగా నడుస్తూ ఆ ప్రదేశాన్ని కనుగొనడమే గమ్యంగా అనుకుని వెళ్ళడం వల్ల,దారిలో మనం చేరే ప్రాంతం లో గొప్పదనం కంటే ,దారి పొడుగునా  ఎదురయ్యే వాళ్ళు కూడా మన గమ్యస్దానాలే అని తెలుసుకోక పోవడం చాల బాధాకరం.  ఇది ఎందుకంటే మనం ఒకరికి ఒకరo దూరమైపోయాం. మనం మర్చిపోయా౦ మన గమ్యం ఒకటేనని.

ఈ మధ్యన అమెరికాలో జార్జ్ ఉదంతం సందర్బంగా ఒక ఆఫ్రికన్ అమెరికన్ పర్యావరణ శాస్త్రవేత్త అన్నాడు...

పర్యవరణ సంరక్షణలో కీలక సమస్య అయిన వనరుల సంరక్షణ కంటే మా జాతి పై చూపిస్తున్న వివక్ష ఎక్కువగా వుంది, కారణం ఈ వివక్ష వల్ల మేము చెప్పేది వినరు. అవును ఇది ముమ్మాటికీ నిజం అక్కడా ,ఇక్కడా కాదు ఇది అంతటా వుంది. దీన్ని  శ్రీకాళహస్తి ప్రాంతంలోని జానపద గీతంలో ఆలకించండి.

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

గరళకంఠుని కడువ నలుపే గదా

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

సూర్యుడు ఎరుపైన,సేంద్రుడు తెలుపైనా

సూసేటి నయనాలు నలుపెగదా

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

గరళకంఠుని కడువ నలుపే గదా

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

వరిచేను పచ్చైనా ,వరికంకు తెలుపైనా

కోసేటి కొడవళ్ళు నలుపే గదా

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు...

 అవును నలుపు ,నలుపు అని నవ్వుతారు, గేలి చేస్తారు, దోచుకుంటారు ,కాని ఆ నలుపంచులోని వెలుగుని మాత్రం చూడరు...

   మాటలని నేను చాలాసార్లు విన్నాను, ఉమ్మడి అటవీ యాజమాన్యం కార్యక్రమం తొలి నాళ్ళల్లో మారుమూల ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ పైన చూపిన వివక్ష కళ్ళారా చూసాను. అంతే కాదు ఎక్కువ శాతం అటవీ అధికార్లు, ఇతరత్రా ప్రభుత్వ అధికార్లు,ఇంకా అనేక మంది  అనేది ఒకే మాట  ‘దొంగల చేతికి, తాళాలు ఇచ్చాం.’ అంటే  మన పాలనా యంత్రాంగంలో గిరిజన, గ్రామీణ ప్రాంత వాసులు అడవుల దొంగలు, పట్టణ వాసులు దొరలు. మారుమూల ప్రాంతంలో తిరిగి చూస్తే కానీ తెలియదు ఎవరు దొంగలో ,ఎవరు దొరలో. దొర దొంగలు,దొంగ దొరలెవరో. కరోన టెస్ట్లు చేసినట్టే ఈ  మహమ్మారికి కూడా పరీక్షలు చేయాలి. అప్పుడు వాస్తవాలు బట్టబయలవుతాయి.

ఇక వారి మాటల్లో వింటే అసలు విషయం  ఏంటో తెల్సుతుంది. అందుకు  ముందుగా  ఉమ్మడి అటవీ యాజమాన్యం గురి౦చి తెలియాలి. ఉమ్మడి అటవీ యాజమాన్యం అంటే ప్రజల భాగాస్వామ్యoతో అడవుల సంరక్షణ చేయాలన్న తలుoపుతో మొదలుపెట్టిన కార్యక్రమం.    ఆలోచనకు పునాది వేసింది వెస్ట్ బెంగాల్లోని అరాబారి అన్న గ్రామం అని అంటారు. అసలు అక్కడ ఎందుకు మొదలయ్యిందంటే , ఆనవాయితీ గా ఆ ఊర్లో సామాజిక వన పధకం కింద చెట్లని అటవీ శాఖవారు నాటే వారు. స్ధానికులకు తీవ్ర వంట చెరకు  కొరత వల్ల. కొద్దిగా  ఎదిగిన చెట్లని , దాని కోసం ఉపయోగించే వారు. దీని వల్ల వనం ఏర్పడలేదు. ఇది గ్రహించి ఒక అటవీ శాఖ అధికారి స్దానికులతో ఒక ఒప్పందం కుదుర్చు కున్నారు. అది, వాళ్ళకు కావాల్సిన వంట చెరకు కోసం  కొన్ని చెట్లని  నాటి, ,దానితో బాటు ఇతరత్రా చెట్లని కూడా వాళ్ళు సంరక్షిస్తే వాళ్ళకు లాభాల్లో పాతిక శాతం ఇస్తానన్నారు. అందుకు ప్రజలూ ఒప్పుకుని సంరక్షణ చేపట్టారు. అది విజవంతమయ్యి అ మాట అoతటా పొక్కింది. ఇంకే ముంది, ప్రపంచ బ్యాంకు, ఇతర ప్రపంచ దాత సంస్ధలు ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందించడం వల్ల అది మన దేశంలో చాలా రాష్ట్రాల్లో అమలులోకి  వచ్చింది. ఇక ప్రపంచ వత్తిడి వల్ల తు.చ తప్పకుండా అమలు చేయడం మొదలు. అప్పటి వరకు అటవీ శాఖ ఆధీనంలో జరిగే అటవీ యాజమాన్యం , ప్రజల భాగస్వామ్యం లోకి మారింది. ఇక అప్పటి వరకు ప్రజల్ని దొంగలు అన్న పాలక వ్యవస్ధ ,ఇప్పుడు దొంగల చేతికి తాళాలు ఇచ్చాం అనడం మొదలు పెట్టారు. ఇది అసలు విషయం.

ఇదే విషయం గురించి  గత మెదక్ జిల్లాలోని నర్సాపూర్ దగ్గర  గ్రామంలో ఈ పధకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్దామె అంది. ‘అంతా బాగానే వుంది సారూ, కాని ఒక్క విషయం అడుగుతా దానికి సమాధానం చెప్పండి సారూ.’ ఏంటి అని అడిగా, ‘సారూ అడవంతా పచ్చగా వున్నప్పుడు ఫారెస్తోల్ల చేతిలో వుండే అడవి, ఇప్పుడు అడవంతా పోయి కూట్లు(వేర్లు) వున్నప్పుడు, దొంగల చేతికి తాళ్లాలు ఇచ్చినామంటారు , గిది ఎంత వరకు నిజం సారూ. ఈరే చెప్పాలి.’  గంతే కాదు సారూ, అసలు అడవిని  ఎవరు పెంచారు సారూ, గదె పెరుగు తది, చెట్లని నాటి పెంచితే గది తోటైతది, అడవి కాదు. గిప్పుడు గీ కూట్లున్నాయి, జరంత మొగులై, ఆన బడితే గవే సిగురించి పచ్చగా ఎదుగుతాయి సారూ’, గదె అడివైతది’. ఇవే మాటలని వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామస్తుడు అన్నాడు, ‘గిదేంది సారూ చేరువులోని నీళ్ళని చేపలు తాగి, చెరువు ఖాళి చేసినాయ్యన్నారు,మల్లా గాదె చేపలకి చెరువు ఇచ్చిన్నారు’.

అవును ఆ కూట్లకి, ఆ చెరువులోని చేపలకి  ఎదిగే సమయం ఇస్తే,  అదే అడివైతది, చెరువు నిండుతది అన్న సూక్ష్మ జ్ఞానాన్ని మన అభివృద్ధి పయనంలో కోల్పోయాం. అందుకే మన బాటకి తోవ సూపేది ఎంత ఎంత దూరం అన్న ప్రోత్సాహం తో బాటు  స్ధానిక వాసుల పచ్చటి జ్ఞానోపదేశం, నేడు మనం కోల్పుతున్నది కేవలం ప్రకృతినే కాదు ఆ జ్ఞానేంద్రియాల్ని కుడా. ఆ జ్ఞానం కలగాలంటే మనకున్న అజ్ఞానం పోవాలి, అందుకు ఈ పాటని పదే పదే స్మరించాలి...

నలుపు నలుపనేరు

నల్గురు నవ్వేరు

జగమేలు నారాయణ నలుపెగదా

సూర్యుడు ఎరుపైన,సెoద్రుడు తెలుపైనా

సూసేటి నయనాలు నలుపెగదా

అభివృద్ధి కాంక్షలో దూరాల్ని పెంచుతున్నామే తప్ప  దగ్గర చేయడం లేదు. ఒక వైపు పచ్చటి హారాలు ఏర్పాటు చేయాలని చెబుతూ , మరో వైపు చెట్టుకి ఉండే నిర్వచనాల్ని మార్చే చట్టాల్ని ప్రవేశపెడుతున్నాం. మొన్ననే చేవెళ్ళ -వికారాబాద్ హైవే లోని  కొన్ని ఏళ్ళ  నాటి  వందల మర్రి చెట్లని నరికేస్తుంటే , చాలా మంది చెట్ల ప్రేమికులు, సంరక్షులు అడ్డుపడ్డారు. దానికి ఇంకా పూర్తి పరిష్కారం దొరికే లోపే, కేంద్ర ప్రభుత్వం  చట్టాలలో కొత్త సిఫార్సులు జోడించే క్రమంలో పూనుకుంది. అది వందకు పైగా వున్న హైవేలకు  చెట్లు అడ్డంగా వుండడం వల్ల వాట్ని నరికివేయాలన్న నెపంతో అటవీ చట్టంలో వున్న చెట్ల నిర్వచనాన్ని మారుస్తోంది. ఇక అశోకుడి నాటి కాలం మాట రహదారుల పక్కన చెట్లు నాటడం , వుండడం అన్నది చరిత్ర లోనే కనబడుతుంది.

వంగారి మాతాయి ఎనర్జీ పావర్టి నుండి  మహిళలను , ఎన్నో కుటుంభాలను  బయటకు తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతో గ్రీన్ బెల్ట్  ఉద్యమం చేపట్టి౦దో దాని ఉద్దేశ్యం మారిపోతోంది.  కరోనా వల్ల వలస కార్మికులు తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ల్లని నగరాలకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు నగరాల్లో వుండి పనిచేస్తున్నప్పుడు, వాళ్ళు వంట వండు కోడానికి గ్యాస్ బండలు వుండవు, చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు  ఇక్కడ వుండి వండు కోడానికి వుండే ముఖ్య ఆధారం చెట్లు. మరి ఈ రహదారులు ఎవరి రియల్ ఎస్టేట్ల అభివృద్ధికి!.    దీనితో బాటు కొన్ని వందల బొగ్గు గనుల తవ్వకాలకి అనుమతులు ఇస్తున్నారు. అటు ,ఇటు యధేచ్చగా పుట్టుకొచ్చే ఈ ప్రక్రియల వల్ల మళ్ళీ వలస ఇంకా ఉధ్రుతం అవుతుంది, క్రమేణా ఎనర్జీ పావర్టి పెరుగుతుంది. దాన్ని పరిష్కరించడానికి దిగుమతులు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి. ఇప్పటికే క్లైమేట్ చేంజ్ వల్ల వలస కూలి పై ఆధారపడే వారి జీవనం ,ముఖ్యంగా మహిళల పై  ప్రభావంపై పలు అధ్యయనాలు వాస్తవాల్ని వెల్లడించాయి. శాస్త్రవేత్తలు 2050 నాటికి మంచు ఖండాలు కరిగిపోతాయి అని అంటున్నారు. అంతె౦దుకు  ? కరోన వల్ల  చనిపోతాం అని తెలుస్తుంది తప్ప , దీని వల్ల బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. పేద పిల్లలకి చదువు అందుబాటులోకి రాకుండా పోతుంది కారణం ఇట్స్ ఆల్   ఎ వర్చువల్ వరల్డ్ ఇన్ ఫ్యూచర్ అన్న వాస్తవాలు  బయటకు రావడం లేదు. కారణం విపత్తులో  కూడా మానవత్వం కాదు ముఖ్యం వ్యాపారం ముఖ్యం. శుభ్ లాభ్ కాదు, లాభ్ శుభ్  అన్నది నేటి నీతి. అందుకే క్రమేణా హరిత హారాలు కూడా   ప్లాస్టిక్ కవర్ల కంపెనీలకి  మంచి లాభ౦ తెచ్చి పెట్టె వ్యాపారాలు. అటు చెట్లు  నరుకుతూ, అడవులని పెకిలించేస్తూ , ఇటు చెట్లు నాటుతూ  పోతాం. లేని వాడు మటుకు  అటు ఇటు పరుగెడుతూనే వుంటాడు.

పోయే..పోయే...

చెట్టూ పోయే

పుట్టా పోయే

భూమి పోయే

పంటా పోయే

కుంటా పోయే

చెరువు  పోయే

పడిన వర్షం

నిలవ దాయే

పనికోసం

పట్నం వస్తే

గాలి కూడా

సోకదాయే

(నల్లగొండ, 96)

ఇక కవిత్వానికి వస్తే మనం దీర్ఘ కవిత రాస్తామా, లేక చిన్న కవిత రాస్తామా అన్న దానికంటే ఆ కవితలో చెప్పదలుచుకున్నది ముఖ్యం.    అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి టైం అండ్ స్పేస్ ని పట్టుకున్న కవిత రూపాల్లో వేమన శతకాలు, ఉర్దూ,పర్షియన్ , సూఫీ, హైకూల్ని మించినవి లేవు. ఎందుకంటే అవి కేవలం  ఒక టెక్నిక్  కాదు ఒక టెక్నాలజీలు. కవిత్వానికి మన మెదళ్ళలో ఎప్పుడూమెదిలే మొబైల్ రింగ్  టోన్లు అవి.   కవిత్వ బీజాల్ని భద్ర పర్చే మట్టి కుండలు. ఒక సారి మణిపూర్ వెళ్ళి నప్పుడు చూశా. అక్కడి మారు మూల  ప్రాంతంలో ని మట్టి గోడల ఇళ్ళల్లో, వాళ్ళు విత్తనాల్ని ఆ గోడల్లో దాచిపెడితే అవి మొలకెత్తడం. అదే దృశ్యం కర్నూలు  జిల్లాలో  పాత ఇళ్ళ మేడల పైన కనబడుతుంది.  నేడు మనకు ఏర్పడుతున్నది కేవలం ఎనర్జీ పావర్టినే కాదు క్రియటివ్ పావర్టి కుడా. కారణం మనచుట్టూ అంతరించుకుపోతున్న పచ్చదనం.

 ప్రపంచానికి చెట్లు కావాలి. ప్రపంచానికి క్రిమికీటకాలు కావాలి. ప్రపంచానికి కవులు కావాలి, వారిలో కొందరు చెట్ల గురించి రాస్తారు.

చెట్లు

జాయిస్ కిల్మర్,1914

నేనుకుంటాను ఇక వవీట్నిఎప్పటికీ చూడను

అందమైన తియ్యటి భూమి రొమ్ములకు

అంటిపెట్టుకున్న ఆకలిగొన్న చెట్టు గొంతును

రోజూ దేవుడి వైపు చూసే చెట్టుని

ఆకులతో నిండిన కొమ్మలతో ప్రార్ధిస్తూ

చెట్టు వేసవి దుస్తులలో

రాబిన్ పిట్ట గూళ్ళను

తన కేశాల్లో అలంకరించుకుని

మంచు తన రొమ్ముల్లో అల్లుకుని

వర్షంతో పెనవేసుకుని జీవిస్తూ.

నా లాంటి అల్పులు కవితలు అల్లుతారు

దేవుడొక్కడే చెట్టుని సృష్టి౦చగలడు

(అనుసృజన జీ.సత్యశ్రినివాస్)