Sunday 26 April 2020 0 comments By: satyasrinivasg

ప్రకృతి, సంస్కృతి వలయాలు



శాస్త్రవేత్తల  ప్రకారం  మనమిప్పుడు ఆంత్ర ఫోసిన్  కాలం లో వున్నాం. ఇది 1950 లో మొదలైయింది, అంటే మానవాళి కృత్యాలు వాతావరణం, పర్యావరణం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అణుధార్మిక శక్తి, ప్లాస్టిక్ వల్ల కాలుష్యం, శక్తి( బొగ్గు, వగైరా ) కేంద్రాలనుండి ఉత్పత్తి అయ్యే కాలుష్యం,  విచక్షణా రహితంగా విసర్జించిన కోళ్ల ఎముకల వల్ల ఏర్పడింది. 12000 సంవత్సరాల క్రితం నుండి నిలకడగా (మంచు యుగం ) గా వున్న వాతావరణం లో మార్పులు ఏర్పడ్డాయి. నేడు ఈ మానవ నిర్మిత వాతావరణం లో ఒక ఎపిడెమిక్ విస్ఫోటించి , మెల్లి మెల్లిగా  పరివ్యాప్తి చెందే వేగాన్ని, కాలాన్ని, ఆవరణని పెంచుకుంటూ పోతుంది... దీని వల్ల పలు చోట్ల  సంఘటనలు పెరుగుతూపోతాయి... అన్ని సంఘటనల కధ వెనక వున్నది కరోన, దాని రూపాలు వేరు.. ఇది,  ది   డీప్ సీ అండ్ ధ డెవిల్...
 ప్రకృతి వైపరిత్యాలు కూడా ఒకే రూపంలో ప్రస్పుటం అవ్వవు,ప్రకృతి లో ప్రతిది ఒకదానితో మరొకటి ముడిపడి వుంది, ‘నీరు పల్లమెరుగు  ఎరుగు, నిజము భగవంతుడికి తెలుసు  లా... . సంఘటనలు జరిగితే వాటి ప్రభావం అంతటా వుంటుంది. అది సామాజికంగా, ప్రకృతి పరంగాను,(ప్రభావ వత్యాసాలు వేరు) ఇదే బయోసోషియల్ స్ఫియర్! విపత్తులప్పుడు బయోసోసిషిల్, ప్రకృతి, లో  వుండే కంటిగ్యుటి(పర్సపరం ఇమిడివున్న జీవావరణం)లో  మార్పులు చాలా వుదృతంగా రియాక్ట్ అవుతాయి.  విపత్తుల కాలంలో మన మెదడులో కూడా చలనం, స్పందన  త్వరితంగా ఏర్పడుతుంది. కనీసం వివేకంగా ఆలోచించడం కూడా మర్చిపోతాం, మనకీ  కామన్ సెన్స్ కూడా తట్టదు.తొందరగా చేసేయాలి అన్న తాపత్రయంతో  స్పందిచేస్తాం! నేడు అదే జరుగుతోంది.దీనినే స్టిమ్యులస్ రెస్పాన్స్ స్టిమ్యులస్ అంటారు.
ఊహించండి ఒక్క సారిగా వివిధ తీరులలో మనుషులు ప్రవర్తిస్తోంటే వాళ్ళన్ని కట్టడి చేసే శక్తి ఎవరికి వుంటుంది?. అటువంటి సందర్భాల్లో ఒకే అంశాన్ని పట్టించుకుంటామా, లేక అన్నిట్ని పట్టించుకుని సవరించుకుంటూ పోతామా? ఇది ఏ పాలక వ్య్వస్దకి సాధ్యం?, కారణం మనం దిగువ  స్ధాయి వ్యవస్ధల్ని నిర్వీర్యం చేశాం, అది ప్రకృతిలోనూ, సమాజం లోనూ జరిగింది. గ్రామాల్లోని ప్రకృతి వనరుల్ని, పంచాయతీ వ్యవస్ధల్ని, ఇతరత్రా వ్యవస్ధల్ని చూస్తేనే అర్ధం అవుతుంది.
 పెద్ద ప్రాజెక్టుల అనుమతులు పై నుండే వస్తాయి, పంచాయతీల  తీర్మానాల్ని పట్టించుకోము, కారణం అక్కడి వనరుల పై అధికార  ఉల్లంఘన . ఇక వారి వనరులు వాళ్ళవి  కానప్పుడు వారి జీవనం వారిది ఎలా అవుతుంది, దీని వల్ల కూడా వలసలు అవ్వడం లేదా!  వలసల్ని అరికట్టడానికి చాలా పధాకాలు ప్రవేశ పెట్టాం, కానీ అరికట్ట లేక పోయాం.
నగరాల్ని కట్టడానికి మనుషులు  కావాలి, వాళ్ళని కూలీలు అనే అంటాం, వాళ్ళు నగర నిర్మాణకర్తలు కాదా! కేరళలో వలస వెళ్ళిన వాళ్ళు ఇతర దేశాల్లో ఇబ్బందులు పడి, తిరిగి రావడానికి, వారి క్షేమం కోసం , ఆయా పంచాయతీలు వాళ్ళ జాబితా చెయ్యాలన్న ప్రయత్నాలు జరిగాయి, అవి పుర్తి  స్ధాయిలో జరగలేదు . హైదరాబాద్ చుట్టుపక్కల ఇటుకల బట్టిలో పనిచేసే ఒడిస్సా వాళ్ళు   తీవ్ర పీడనకు, హింసకు గురవుతుంటే ఇటు వంటి చర్యలు  తాత్కాలికంగా చేపట్టి, ఆపేశారు. నగర వీధుల్లో ఉంటున్న వారికి (హోం లెస్) వారికి షెల్టర్స్ కి కేంద్ర  ప్రభుత్వం  నిదులున్నపటికీ, వాట్ని సరిగ్గా వుపయోగించలేదు. కాని ట్రంప్ వచ్చినప్పుడు మాత్రం బస్తిలను ఖాళి చేయిస్తాం. ఇప్పుడు వాళ్ళ పైన బాధ్యత చూపిస్త్తాం. మరి ఈ ద్వంద వైఖరి ఎందుకు? అసలు మన చుట్టూ ఎవరున్నారో మనకే తెలియదు. కరోనా పుణ్యమా  అని  ఎవరు, ఎక్కడ, ఎంతమంది వున్నారు అన్నది బయటకు వస్తోంది. మరి యూరోప్ లో ఇమ్మిగ్రెంట్స్, పాలెస్తీనియన్ల్ పరిస్ధితి ఏంటి?.
డార్క్ ఇకాలజి ప్రస్తావించేదల్లా... మనకు కనిపించేదల్లా...అపరిచిత మైనది. ఇకోజ్ఞాసిస్ ప్రకారం,  దానికి(ప్రకృతి) తెల్సినది మనం తెల్సుకోవడం, ఇది ఒక చిక్కు ప్రశ్న, పర్యావరణ అవగాహన అన్నది ఒక ఉచ్చుల తో అల్లుకున్న వలయం , జీవారణ, జీవవ్యవస్ధలు  కూడా అంతే,మానవ ప్రమేయం కూడా ఒక ఉచ్చు రూపం లో వుంటుంది.!  ఈ ఉచ్చుల్ని ఛేదించాలంటే ప్రపంచంలో మన ‘జీవ’ ఆవరణ ఎపిసోడ్స్ అర్ధం అవ్వాలి ...
ఎపిసోడ్ -1
ఒక్క క్షణంలో 50 ఆలోచనలు వస్తాయట
ఒక నిమిషానికి  3000
గంటకి 180000, రోజుకి   4320000, 20 రోజులకి 86400000….
ప్చ్..
ఒక్క ఆలోచన కూడా  నిలకడగా వుండదు ,
అసలు ఎటువంటి ఆలోచనలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు
తిరుగుతునప్పుడు ,పని చేస్కుంటున్నప్పుడు,కదలకుండా ఒకే చోట కూర్చునప్పుడు వచ్చేవి వేరు
శరీరం కదలకుండా వున్నా, మెదడులోని ఆలోచనలకి నిలకడలేదు
అంతటా ... నేడు
ఒకే ఒక ఆలోచన
చావు నుండి బయటకు రావాలి ,
అందుకు మార్గం ఒక్కటే
ఇంట్లోనే కూర్చోవాలి...
కాని ఇంట్లోనే 21   రోజులు కూర్చోవడం ఎలా?
అదే ఒక భయపెట్టే ఆలోచన...
ఇదే యూనివర్సల్ పిక్చర్  స్టోరీ లైన్
అందరి  విలన్ కరోనా.  దాని రూపాలు వేరు,  వివిధ రీతుల్లో ప్రబలుతోంది.

 ఎపిసోడ్ -2
అభ్ క్యా కర్నా !
ఛలో ఎవరు ఏంటి అన్న క్యారెక్టర్స్ మ్యాప్ ని చూద్దాం ...
 సహజంగా వైరస్  సోకిన వాళ్ళు, సామాజికంగా సోకినవాళ్ళు, తనతో బాటు అందరికి సోకించాలనుండే –వైల్డ్ ఫైర్స్ లాంటి వాళ్ళు, ఇదే అదను అనుకుని లాభాలు చేస్కునే వ్యాపారులు, రోజుకూలి దొరక్క అలమంటించే వాళ్ళు, ఇంట్లో వుండి ఆన్ లైన్ లో చదువుకునే విద్యార్ధులు, చెత్త ఎత్తుకునే వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, ఇళ్ళు లేక   రోడ్ల పైన నివసించే వారు, పూజారులు, ఏది వచ్చినా రాకపోయినా మారని తమ  విధుల్ని నిర్వర్తించే మహిళలు, ముసలి వాళ్ళు, పిల్లలు, విధి నిర్వహణలో నిమగ్నమైన డాక్టర్లు, పోలీసులు, పాలకులు, ప్రభుత్వ ఉద్యోగులు. వగైరా, వగైరా...
నాకేమవుతుంది, దీని నుండి ఎలా బయట పడాలి, ఇది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనుకునే వాళ్ళు.
వ్యక్తులు, కుటుంభాలు, సమూహాలు, ఊర్లు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం అంతా ఎప్పుడు వైరస్ పోతుంది అన్న ఆందోళనలో!.
గది గడప నుండి  ప్రపంచ తలుపులన్నీ మూసి వేసి వున్నాయి. నిర్మానుష్యమైన వీధులు...  ఆలోచనలు ఒక్కటే తెరచుకుని వున్నాయి.
ఎపిసోడ్ --3
ఇంట్లో టి.వి.,మొబైల్  సవ్యంగా,సమయానుసారంగా పనిచేస్తున్నాయి. అప్పుడే ఒక హౌస్ సర్జన్  విధులు ముగించి ఇంటికి వచ్చింది, ఇంట్లోకి అడుగిడగానే , మీరు ‘వెంటనే  ఇల్లు ఖాళి చేయాలి ‘ అని ఇంటి యజమాని దారికి అడ్డంగా  నుంచున్నాడు.  ఎందుకు అని అడిగేతే ,కారణం చెప్పాల్సిన అవసరం లేదనట్టుగా చిరాకుగా మొహం పెట్టాడు. పట్టుబట్టి అడిగితే  ‘మీకు వైరస్ సోకుతుంది, మా జాగ్రత్తలో మేముండాలి, అందుకే’! . మొన్ననే కదా ,వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వైద్య సహాయం చేశాం అంది. అవేవీ ఇప్పుడు జ్ఞాపక్లం లేవన్నటు గా ప్రవర్తిస్తున్నాడు. ఆమె అలోచనలో పడింది,  నిన్ననే మాకు చప్పట్లు కొట్టారు, ఇంతలోనే దూరంగా వుండమని తరిమేస్తున్నారు, అసలు ఏది వైరస్ , ఏది కాదు. ఇల్లు అద్దెకు తీసుకుంటునప్పుడు, వాళ్ళ ఇంట్లో ఎవరుంటున్నారు అన్న విషయం కంటే ఆ ఇంటి ల్యాండ్ వ్యాల్యూ చెప్పుకుంటూ వచ్చారు, దాని బట్టి ఇంటి అద్దె పెంచాడు. ఈ లొకాలిటి బాగా డెవెలప్ అయ్యిందట అందుకే అద్దెలు ఎక్కవ,  డెవెలప్మెంట్ని చూసి కాదు, కాలేజీకి దగ్గరగా ఉంటుందని చేరాం. బాగానే డెవెలపయ్యారు. ఇప్పటికీ తెలియదు వాళ్ళ  కుటుంబంలో ఎవరుంటున్నారన్నది. ఇప్పుడు అందర్నీ ఇంట్లో వుండమంటున్నారు, కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా వుంటున్నారన్నది తెలియదు.
అసలు ఇల్లు ఏంటి, కుటుంబం ఏంటి, మనం ఎక్కడ వుంటున్నాం ! శారీకంగా వైరస్ సోకిన వార్ని ఇసోలేషన్ లో వుంచుతున్నాం , మరి ఇట్లాంటి వార్ని ఎక్కడ వుంచాలి?.
ఎపిసోడ్ --4
  ఈ సంఘటనని  1760 నాటి కాలంలో మరో విధంగా చూద్దాం!. ఈస్ట్ ఇండియా కంపెనీ(ముఖ్యంగా  బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ) వాళ్ళు వ్యాపార దశ నుండి  మన దేశంలో సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని  (అప్పటికి  ఇంకా  భారత దేశం ఏర్పడలేదు)  నిలదోక్కు కోడానికి ముఖ్యంగా ఇక్కడి వాతావరణం పై వారు అవగాహన కల్పించుకున్నారు. మనకి వాతావరణం ఎంత స్నేహంగా  వుంటుందో , అంతే శత్రుత్వాన్నీ చూపిస్తుంది. ఇది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు వుండే వాస్తవం.అందుకే  ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు స్ధానిక  జీవావరణ వ్యవస్ధల తీరుని, వాటినుండి వచ్చే రోగాల గురించి  విస్తృతంగా పరిశీలన చేశారు. స్ధానిక వైద్యుల  నుండి ఈ సమాచారం సేకరించి తమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్కున్నారు, అలా వలసవాదం ఏర్పడింది దాని వల్ల వనరుల్ని కొల్లగోట్టుకోవడం మొదలైంది. ఈ పంధాలో వాళ్ళు మెడికల్ టోపోగ్రఫి(  భౌగోళిక ప్రదేశాలు  మానవుల ఆరోగ్యం పై ఎలా ప్రభావం చూపుతాయి అన్న దాని పై సమగ్రమైన అధ్యయనం.) మెడికల్ జియోగ్రఫి( స్ధానిక ఆవరణ, వాతావరణం వల్ల  ఆరోగ్యం పై ఏర్పడే  ప్రభావం, దీని ద్వారా ప్రజా ఆరోగ్య సంరక్షణకై తగు చర్యలు పై చేసే అద్యయనం).
1760  కాలంలో వాళ్ళ  వైద్య బృందాలలోని డాక్టర్లు వైద్యం ,జీవ శాస్త్రం అధ్యయనం చేసిన వారు, వాళ్ళు మొక్కలు, చెట్లు నాటడం, బొటానికల్ గార్డెన్స్ కి  పర్యవేక్షలుగా కూడా పనిచేసే వారు. అంటే వాళ్ళు ఏర్పరుచుకునే  సామ్రాజ్యంలో  మొదటి శత్రువు, మిత్రువు అక్కడి వాతావరణం , స్ధానిక ప్రజలు తర్వాత సంగతి.  ఇదే విషయాన్ని చార్ల్స్ డార్విన్ ధ డిసేంట్ అఫ్ మ్యాన్ (1871) లో ప్రస్తావించాడు, ‘నాగరిక సమాజలు , అనాగరిక సమాజలతో తలపడినప్పుడు, పోరాటం చాలా తక్కువ నిడివిలో  ముగుస్తుంది, కాని భీకర మైన వాతావరణం స్ధానికులకు సహకరించినప్పుడు కాదు’. కారణం ఇట్ ఇస్ ‘ఇకోజ్ఞాసిస్”
ఇప్పటికి మన వాళ్ళు బాగా ఎండగా వునప్పుడు, చలిగా వున్నపుడు బయటికి వెళుతుంటే జాగ్రత్తగా   వుండే సూచనలిస్త్తాం! వైద్యం అన్నది కేవలం రోగ నివారణకు చేసే చికిత్స  కాదు, మన ప్రకృతి, వ్యక్తిగత,సామాజిక మానసిక  నడవడకి తీరుతెన్నులని గ్రహించి, అంచనా వేస్కుని,  ఆయా ప్రాంత పర్యావరణానికి మన జీవనాన్ని మల్చుకునే ప్రక్రియ! మరి ప్రకృతి, వ్యక్తిగత,సామాజిక మానసిక  నడవడకని మార్చే  తీరుకి వైద్యులు ఒక్కరే, ఒకే వ్యవస్దే దోహదం చెయ్యదు  కదా! ప్రకృతి ని సమాజాన్ని అర్ధం చేస్కోవాలంటే అన్ని కిటికీలు తెరవాలి, ఒక్క కిటికీ తెర్చి చుస్తే సరిపోదు!
నేడు ప్రపంచలో దరిదాపు అన్ని దేశాల్ని ఏక కాలంలో ముట్టడించిన కరోనాకీ  వైద్యం ఏంటి, వైద్యులు, ఎవరు, రోగులు ఎవరు, నా దృష్టిలో అందరం అన్నీను!  మనం , నాగరికత పేర్న   సృష్టించుకున్నది బయోసోషల్  డిస్టెన్స్. ప్రకృతి నుండి భౌతిక సామాజికంగా విడిపోవడం, కులం ,మతం, జాతి ,తెగ అన్నవి కూడా మినహాహింపు కావు, సోషియో బయో డిస్టేన్సులు, మన సమాజంలోని కుల వర్గీకరణ పెర్న వనరుల ఆధిపత్యానికి దోహదపడ్డాయి  , వీటి గురించి మున్ముందు చర్చిద్దాం.

ఎపిసోడ్ --5
 ఈ మధ్యన మిత్రుడు కోడూరి విజయ్ కుమార్ అనువదించిన చైనీస్ కవిత  ఇక్కడ ప్రస్తావిస్తాను, నేటి పరిస్దితులని  అనుభవ పూర్వకంగా ,అవేదనలని చాలా  సులభ తీరులో వ్యక్తపరచిన కవిత,...... అంతే నేటివిటితో  అనువందించాడు కోడూరి విజయ్.
దయచేసి విసిగించకండి
దయచేసి నా రక్షణ వస్త్రాలను,
మాస్క్ నూ తీసివేయనీయండి
ఈ రక్షణ కవచాన్ని తొలగించి
నా మాంస దేహాన్ని విడుదల చేసుకోనీయండి
నా ఆరోగ్యం బాగుందని నన్ను నమ్మనివ్వండి
ప్రశాంతంగా నన్ను ఊపిరి తీసుకోనివ్వండి
ఓహ్ -
నినాదాలు, ప్రశంసలు, ప్రచారాలు
ఆదర్శ సేవకులు ... అన్నీ మీరు సృష్టించినవే
వైద్య వృత్తికి వుండవలసిన మనస్సాక్షితో
నేను నా విధులు మాత్రమే నిర్వర్తిస్తున్నాను
జీవితానికీ మరణానికీ నడుమ ఏదో వొకటి
నిర్ణయించుకునే అవకాశం లేకుండా
గంభీరమైన ఆదర్శాలు ఏవీ లేకుండా
తరచుగా యుద్ధ భూమికి గుండెల నిండా
ఊపిరి తీసుకుని మాత్రమే వెళ్ళవలసి వుంటుంది
దయచేసి నన్ను పూల దండలతో అలంకరించకండి
దయచేసి నన్ను ప్రశంసలతో ముంచెత్తకండి
విధి నిర్వహణలో తగిలే గాయాల తోనో, అమరత్వంతోనో
దయచేసి నాకు గుర్తింపునివ్వకండి
చెర్రీ పండ్ల రుచి కోసమో,
ప్రకృతి రమణీయ దృశ్యాల కోసమో
మైమరపించే ఆహ్వానాల కోసమో
నేను ఈ వూహాన్ నగరానికి రాలేదు
ఈ అంటువ్యాధి అంతరించాక
వొట్టి ఎముకల గూడులా నేను మిగిలినా సరే
నా పిల్లల కోసం నా తలిదండ్రుల కోసం
నేను సురక్షితంగా నా ఇల్లు చేరాలి
మీరే చెప్పండి
సహచరుల చితా భస్మాన్ని అందుకోవాలని
ఏ కుటుంబానికి మాత్రం వుంటుంది?
రోడ్డుపై అడుగు పెట్టగానే మీదపడి
ప్రశ్నలతో వేధించే మీడియా మిత్రులారా
దయచేసి నన్ను మళ్ళీ విసిగించకండి
మీరు అడిగే వాస్తవ సంఖ్యలూ, సమాచారమూ
దేని మీదా ఆసక్తి లేదు నాకిపుడు
రాత్రీ పగలూ విసిగిపోయి వున్నాను
కంటి నిండా నిద్ర, కరువు తీరా విశ్రాంతి
మీ ప్రశంసల కన్నా విలువైనవి ఇపుడు
మీకు చేతనైతే ఖాళీ ఐపోయిన
ఆ ఇళ్లకు వెళ్లి చూడండి
ఏ వంటింటి నుండైనా పొగ వొస్తోందా?
శ్మశాన వాటికల చుట్టూ భ్రమిస్తోన్న
సెల్ ఫోన్లను వాకబు చేయండి
వాటి యజమానులు దొరికారేమోనని
 ( వీ షుయిన్ - చైనా కవిత,తెలుగు: కోడూరి విజయకుమార్)
చివరి పంక్తులు చదువుతుంటే  నాకు వ్యాధిగ్రస్తులతో బాటు , వైద్యం చేసే  వారు ఆలోచనల్లో  మెదులుతున్నారు, ఆ  ఆలోచన పుట్టలో నుండి మొలకెత్తిన పేరు, డా. ద్వారకానాథ్ కొట్నిస్. కొట్నిస్ 1938 లో జపాన్ – చైనా మధ్యన యుద్దమప్పుడు సుబాష్ చంద్ర బోస్ పిలుపు మేరకు   సహాయ సేవలందించడానికి స్వచ్చందంగా  వెళ్ళాడు. మన దేశం నుండి  వెళ్ళిన అయుదుగురి బృందంలో ఈయన ఒకరు, ఆయన వెళుతున్నపుడు చెల్లెలు పలికిన మాటలు  ‘కొట్ని స్ కి ప్రపంచమంతా తిరిగి వైద్య సేవలు అందించాలన్న కోరిక, మాకు చైనా గురించి ఎక్కువ గా తెలిసింది లేదు, తెలిసిందల్లా , వాళ్ళు ఇక్కడ చైనా సిల్క్ వస్త్రాలు అమ్ముతారు’. తల్లి చాలా ఆందోళన పడింది, దూర ప్రాంతంలో ని యుద్ధ భూమికి వెళుతున్నాడని. తండ్రి నిబ్బరమైన గుండెతో పంపించాడు.
 ఆతను మొదటి గా చైనాలో వుహాన్ నగరంలో అడుగుపెట్టాడు, యుద్ద భూమిలో క్షతగాత్రులకు చాల సేవ చేశాడు. 1940లో గుయో క్విన్ చియాన్ అనే నర్సుని కలిశాడు , ఇద్దరు ప్రేమ వివాహం చేస్కున్నారు, 1942  లో ఒక మగ  పిల్లడు పుట్టాడు, ఆ పిల్లాడి పేరు,హిం  హువా అంటే (హిం అంటే ఇండియా, హువా అంటే చైనా). 9 డిసెంబర్   1942 లో ఆయన ఎపిలెప్సి వల్ల మరణించాడు. నాన్ క్యువాన్  వూర్లో యుద్ధ వీరుల సమాధుల పక్కనే అయన సమాధి చేశారు. అప్పుడు మావో అన్న మాటలు, ‘సైన్యం ఒక సహాయ హస్తాన్ని కోల్పోయింది, దేశం ఒక మిత్రుడ్ని కోల్పోయింది, మనమందరం  మానవాళికి సేవలందించాలన్న  అతని ఆశయాన్ని ఎప్పటికీ మరవద్దు”  2005 ఏప్రిల్ లో డా. నోర్యాన్ బెతూన్, కొట్నిస్ సమాధులని చైనా ప్రజలిచ్చిన పుష్ప గుచ్చాలతో అలకరించారు ఆ రోజు కిన్గ మింగ్ పండుగ అంటే  వాళ్ళ  పూర్వికులను తల్చుకునే రోజు. మనం మటుకు అతనిని ఎప్పుడో మర్చిపోయాం. ఆయనని చైనా వాళ్ళు ‘కే దేహువ’ అని పిలిచేవారు.
నేటి ఆంత్రఫోసీన్ సంస్కృతిలో  మనని మనం ,చట్టుపక్కల వాళ్ళని పట్టించుకోకపోవడం  సర్వసాదారణం.. అంతా...
శ్మశాన వాటికల చుట్టూ భ్రమిస్తోన్న
సెల్ ఫోన్ల వాకబు ...
అవును మనం అధునాతన ప్రపంచంలో పుటుక , పెళ్ళిళ్ళు . పూజలు పునస్కరాలు, చావు   స్మశాన వాటికలలో(మహా: ప్రస్తానం)  అన్నింటిలో  మన సంభాషణ , అన్నీ సెల్ ఫోన్ల ద్వారానే కారణం మన సెల్ల్స్ మారిపోయాయి, అరచేతిలోని కొత్త సెల్ వలయంలో అల్లుకున్న రేఖలం.
Saturday 4 April 2020 0 comments By: satyasrinivasg

చీకటి పొరలు




లార్డ్ బైరాన్ చీకటి కవిత లోని  మిగతా పంక్తుల్లోకి

జంతువులు ఆకలి తీరక వాటి నాలకల్ని బయటకు జాపుకునున్నాయి,
జాలితో కూడిన మూలుగుతో,
అంతలోనే అతని  చేతుల్ని నాకుతూ  ఒక  నిర్దయ రోదన,
సుశ్రూషతో కూడిన సపర్య  కాదు- అతను మరణించాడు.
కరువు కాటకాలతో  కుప్పలతెప్పలుగా  జన సమూహం  ; కాని ఇద్దరు
మహా నగర వాసులు బతికే వున్నారు,
వాళ్ళు శత్రువులు:పక్కపక్కనే కలిశారు
బలి-ప్రదేశంలోని  బూదిదలా మృతిచెందుతున్న వాళ్ళు
కుప్పల కొద్దీ పేర్చివున్న పరిశుద్ధ వస్తువులు ఏర్పరిచిన  చోట
అపరిశుద్ద  వినియోగానికై ;పేర్చుకున్నవి
వణుకుతున్న వాళ్ళ చల్లని ఎముకల చేతులతో పేర్చుతూ
మిగిలిన కొద్దిపాటి  బూడిద, వాళ్ళ నిర్జీవ శ్వాస
కొద్దిపాటి జీవితం కోసం నిప్పుని రాజుకుంటూ  ,వూదుతున్నారు
అదంతా ఆవహేళన ; తర్వాత లేచారు
వాళ్ళ కళ్ళు, మందగిస్తున్న చూపులతో 
ప్రతి ఒక్కరి  అంశాన్ని- చూస్తూ, అరుస్తూ, చనిపోయాయి-
ఒకరికొకరు పరిచయం కాకుండానే  మృతిచెందారు ,
ఎవరి భుజం పైన ఎవరు వాలి  చనిపోయారో సైతం తెలియదు
మహమ్మారి కరువు వాక్యం . ప్రపంచం శున్యం,
 ప్రఖ్యాతిగాంచినవి,అధికారమైనవి అంతా కుప్పలు,
ఋతువులు  లేవు, ఔషధాలు లేవు , చెట్లు  లేవు ,మనుషులు లేరు,జీవమూ  లేదు-
 చావు కుప్పలు- గుట్టల  కొద్దీ సున్నపు మట్టి.
నదులు, తటాకాలు,సముద్రాలు అన్నీకదలలేని స్దితిలో ఆగిపోయాయి,
ఇంకేమీ కదలికలు లేని వాటి నిశబ్ద లోతులు ;
 కుళ్ళిపోతున్న సముద్రంలో నావికులు లేని ఓడలు,
కొద్దికొద్దిగా పడిపోతున్న ఓడ  పైని జెండాలు : అవి పడిపోతున్నపుడు
 అలలు లేని  చోట అవి లోతుల్లోకి కురుకుపోతూ-
కెరటాల  సమాధుల్లో అలలు మరణించాయి;,
చంద్రుడు,అతని ప్రియురాలు . ముందుగానే శ్వాసవదిలారు;
చలనంలేని  గాలిలో వాయువులు చెల్లాచేదురయ్యాయి,
మబ్బులు అంతరించి పోయాయి; చీకటి  ఇక  అవసరం లేదు
వాటి సహాయమునూ- ఆమె విశ్వం.
 ---
చీకటిలోని ఆంతర్యం...అంతటి పరితిస్దిలోనూ ఒకే ఒక కుక్క తన యజమాని శవానికి కావలి కాస్తూ , ఎవరినీ దాని దరిచేరనీయకుండా ,శవం చేతులు నాకుతు ,రోదిస్తూ అక్కడే వుండింది. అది ఒక్కటే ఈ ప్రపంచంలో మంచితనానికి, చిహ్నంగా వుండి,  చెడుని, చీకటిని  దరికి చేరనీయకుండా , మిగిలి,  చివరికి ప్రాణం వదిలింది..
బలి-ప్రదేశంలోని  బూదిదలా మృతిచెందుతున్న వాళ్ళు అంటే కేవలం  జన సమూహం అని కాదు మొత్తం మానవాళి అని  కవి చెబుతున్నాడు.వాళ్ళందరూ ఒకే తరుణంలో చావలేదు , మెల్లి, మెల్లిగా మృతిచెందారు. ఇద్దరు మనుషులు, బతికి వున్న మహానగర మనుషులు, శత్రువులయ్యారు వాళ్ళు ఆడం ,ఈవ్ ల పుత్రులు కైన్, అబెల్. వాళ్ళిద్దరూ ఒక బలి ప్రదేశంలో కలిశారు అక్కడ  పరిశుద్ధ వస్తువుల్ని అపరిశుభ్రంగా వాడుతున్నారు. ఆక్కడ దహనమవుతున్న శవాల వద్ద మోకాళ్ళ మీద కుర్చుని బూడిద ఏరుకుంటున్నారు.దేవుడు వీళ్ళకి పరీక్షపెట్టాడు , కాని ఇక ఏ దిక్కు  లేని  సమయంలో తిరిగి పాత మత దారే పట్టారు. ఆ కొద్ది పాటి  బూడిద నుండి నిప్పు రగిలించి ఒకరి మోకాలు ఒకరు చూస్కుని విస్తుపోయారు. లేక అటువంటి దుర్భర పరిస్ధితుల్లో కూడా ఘర్షించు కున్నామా అని   భయపడ్డారు, వాళ్ళు చనిపోయారు. ఎప్పటికి,  ఎవరు నీతిమంతులో మనుషులు గుర్తించలేక పోయారు. ఒకరినుండి ఒకరు తమని గుప్తంగా వుంచుకుంటూ... ఇప్పుడు ప్రపంచం  జీవం లేనిది, అధికారం ,ప్రఖ్యాతలు అంతా బూడిదలో కలిశాయి.దేవుడో, మరో శక్తో ప్రపంచాన్ని శూన్యంగా మార్చింది.. చీకటి సృష్టి కర్త అంతటా తిరిగి సమానత్వాన్ని సృష్టించాడు. ఇప్పుడు ప్రపంచం అంతా సమానమే. గాలి ,వాయువులు,ఓడలు అన్నీ ఎక్కడవక్కడే నిశ్శేష్టులయ్యాయి, ఇక చీకటికి అండదండలు,సహాయము  అవసరం  లేదు. అది విశ్వం అయ్యింది.
కవి చివరిలో  అంతిమ రోజుల్ని ఓల్డ్ టెస్టమెంట్ భగవత్ వాక్కుతో ముగించాడు. ఇప్పటి మన పరిస్ధితి బహుశా ఇలానే వుంది. ప్రపంచమంతా  లాక్ డౌన్ అయ్యి కొన్ని ఏళ్ల వెనకకు చీకట్లోకి  వెళ్ళింది, ఎంత వెనకకి పోతున్నాయో  ఆయా దేశాల అభివృద్ధి సూచికలనూ గమనిస్తే తెలిస్తుంది. అది  నేడు నిర్మానుష్యమైన రోడ్లని  చూస్తుంటే   400 ఏళ్లకూ పైగా వున్న  హైద్రాబాద్, ఎప్పటి హైద్రాబాద్లా వుందో  పెద్దవాళ్ళు చెప్పగల్గుతారు. కోటిని, ఒక్కప్పుడు తురేబాస్ ఖాన్ రోడ్ అనే వాళ్ళు, గాంధి మెడికల్ కాలేజ్ ఎదురుగుండా వుండే పోలిస్ స్టేషన్ దగ్గర  ఆ బోర్డ్ కూడా వుండేది, తురేబాస్  ఖాన్ అనే ఆయన 1857 లో బ్రిటిష్ రెసిడెన్సి(విమెన్స్ కాలేజ్) ఎదురుగా తిరుగుబాటు చేశాడు, అందుకే దానికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు అ రోడ్డు బహుశా అప్పటి కాలండి గా కనిపిస్తోంది.



ద నేకడ్ ట్రూథ్ ఆఫ్  గ్రీన్ డార్క్ నెస్
లార్డ్ బైరాన్ చీకటి  కవిత నేటి పరిస్ధితులకు అద్దం  పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకారం కరోన వైరస్ అన్నది ప్రకృతి సిద్ధంగా పుట్టింది తప్ప కుట్ర దారుల సిద్ధాంతాల ప్రకారం ల్యాబ్ లో జననం పొందలేదు. ఈ కరోన  వైరస్ వల్ల నేడు ప్రబలుతున్న రెండు రకాల వైరస్లకూ మరొకటి జతకూడింది. ఎపిడెమిక్( ఒక ప్రాంతంలో పరిమితమైన అంటురోగం) ప్యాన్డమిక్(  స్దానికంగానేకాక విస్తృతంగా ప్రభలే అంటురోగం) మూడవది, కొత్తది ఇన్ఫోడేమిక్(అంటే  తప్పుడు సమాచారం తో ప్రభలే అపోహల అంటురోగం). బాగా ప్రచారమైన అపోహ ఏమిటంటే SARS-COV-2   వైరస్ని లాబ్ లో సృష్టించారని, (W.H.O నిర్దారించేది అది ప్రకృతి పరంగా గబ్బిలం లేక పాన్గోలిన్ అనే జంతువునుండి వచ్చిందని(కచ్చితంగా చెప్పలేదు) ది నేచర్  మేడిసన్ అన్న జర్నల్ లొ ప్రచురించారు. ఇది వైరస్ రూపం, దాని వెన్నముక పై నిర్దారించినది.)  నేడు మొదటి రెండిటికంటే మూడవది చాలా వేగంగా ప్రపంచమంతా ప్రభలింది. ఎందుకంటే ఈ సమాచారాన్ని మనం మన  బొటని, చూపుడు వేళ్ళతో త్వరితంగా పరివ్యాప్తి చేస్తాం.  అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సైతం మినహాహింపు కాదు, చైనాని దుమ్మెత్తి పోశాడు, W.H.O  ఆ అవాక్కు చవాకుల్నిఅడ్డుకుంది. నేడు అమెరికా ఇటలి తర్వాత అంత తీవ్ర స్ధాయిలో ప్రభావితమయ్యింది , దీనికి ఎవర్ని దుషించాలిచాలి.
 కవి లార్డ్ బైరన్ అన్నట్టు, నేడు సోషల్ మీడియాలో వైరస్ కీ సంబంధించిన వాస్తవాల కంటే అవహేళన బాగా సోకుతోంది. నేడు కరోన ప్రభలిన, దేశ పాలక రాజకీయ  పార్టీలన్నీ, W.H.O, మొదటి రెండిటిని శాయశక్తులా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికి మూడోది వాళ్ళ అధినంలో  లేదు. ఈ వైరస్ భీజం  ద్వారా తెలిసే కీలకమైన అంశం, వ్యక్తిగత నడవడిక నుండి, వ్యవస్ధ స్ధాయి వరకు మార్పులు చేస్కోమని . వ్యక్తిగత, సాముహిక, సామాజిక నడవడిక తీరుని నియత్రించేందుకు  మందులూ మాకులూ లేవు, చట్టాలు, అధికారాలు తప్ప, కానీ అవి కూడా  మనిషి సృష్టించుకున్న విపత్తులు(కులం, మత,జాతి వగైరా ఘర్షణలు, యుద్ధాలు వగైరా..) ప్రకృతి(ఇందులోనూ మానవ ప్రమేయం వుంది) సృష్టించినవి.మొదటి దాంట్లో ప్రపంచ చివరి రోజులు అన్న భయం వుండదు, రెండవ దాంట్లో ముఖ్యంగా సంక్రమిత రోగాలు, ఇతరత్రా గ్రహాంతర దాడి వల్ల అపోక్యాలిప్స్(ప్రపంచ అంతం ) అన్నది ఐమిడి వుంటుంది.  అ మొదటి విప్పత్తులలో మానవ నడవడిక తీరుకి, రెండవ దాంట్లో నడవడిక తీరుకి చాలా వ్యత్యాసం వుంటుంది. ఇవి గమనించి మనం ఏ వైరస్ని ఎలా అరికట్టాలి అన్నది ఆలోచించేటప్పుడు, వైరస్ భౌతిక అస్తిత్వాన్ని, అది పయనించే మార్గాన్ని గమనిస్తాం ,అది దూరే మార్గం. నేటి (అర్బోసెంత్రిజం) సమాజంలో మనిషి ఎప్పుడో తన నుండి, తన కుటుంభం నుండి, సమూహం,సమాజం నుండి ఐసోలేట్ అయ్యాడు. ఇప్పుడు సామూహిక సమాజం అన్నది వర్చువల్ రియాలిటి(పాపులర్  సినిమా ,సీరియళ్ళులా   ) ప్రతి వ్యక్తి ఇప్పుడు సెల్ఫ్ సెంట్రిక్.  తన గడపెదుటే చావు వుంది, లేక దారిలో వుంది అని చెప్పినా , రేపు తనకు కావాల్సిన అవసరాలకి తగ్గటుగా సరుకులు పేర్చుకోవాలి అన్న ఆరాటం ఎక్కువ, మరి అదే పరిస్ధిని వర్తకులు, మధ్య వర్తులు  లాభం గా మార్చుకోవటం లేదు!. ఇక్కడ చావు కాదు కీలకమైనది, అవసరం,ఆ అవసరాన్ని ఎలా, ఎవరు, ఎందుకు మల్చుకుంటారన్నది కీలకం.  సో వాట్ ఈజ్ రియాలిటి?
ఒక మంచి, చెడు వల్ల రెండు తప్పనిసరిగా జరుగుతాయి, లేటేంట్ అండ్ మ్యానిఫెస్ట్ ఫంక్షన్స్. అంటే ప్రత్యక్షంగా,పరోక్షంగా జరిగే చర్యలు. ముఖ్యంగా పరోక్షంగా జరిగే చర్యల్ని అంచనా కట్టాలి. నేటి అర్బోసెంత్రిజం(నగరీకరణ చుట్టూ అల్లుకున్న అభివృద్ధి దృక్పధం)  తోవలో సోషల్ ఫెన్సింగ్ (సామాజిక కట్టుబాటు ) అన్నది కనుమరుగైయ్యింది.
మనం ఏదో మన ఆచారాలని  గొప్పగా  చెప్పుకుంటాం కానీ మన ఆచారాలలోని కట్టుబాట్లు క్షీణించి చాలా కాలమయ్యింది, ఇక ఆచారాలు , కట్టుబాట్లు అన్నవి ఎప్పటికీ స్ధిరంగా ఉండేవి కావు. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నార చీరలు చూశాం, నేడు ప్రతి సీరియళ్ళలో  రాత్రి పడుకునేటపుడ్డు కూడా  పట్టు చీరలు .నగ నట్రాతో  పడుకునే రోజులోచ్చాయి. సమాజం కోసం వ్యక్తిగత నియంత్రణ రోజులు చెల్లాయి, సామాజిక హితం కోసం వ్యక్తి, సమాజం రెండు వ్యవస్ధలూ పాలనా యంత్రాగానికి, ప్రభుత్వానికి అప్పచెప్పేశాయి.  మనమందరం సమస్య గురించి కొద్దో గొప్పో అవగాహన  వున్న వాళ్ళమే ,కానీ కొరవడిందల్లా, సునిశిత. అందుకే అంతా చట్ట పరంగానే, జరగాలి. సామాజిక కట్టుబాట్లతో నడవాలంటే అది గ్రామాల్లో చలామణి అయ్యే అవకాశం వుంటుంది కారణం అక్కడ ఇంకా , కుల, మత ,జాతి,రాజకీయ,వ్యక్తి పలుకుబడి   అన్న సామజికమైన వ్యవస్ధలు చలామణిలో వున్నాయి. అక్కడ ఇంకా మట్టి వుంది, ఆ మట్టి లో    ఆ రసాయనాలున్నాయి. నగరం లో మట్టి లేదు, ఇక్కడి జీవనం ఏకాకి జీవనం , ఇది వాస్తవం, ఇదే ఇక్కడి జీవావరణం.
మనం తరుచు చేసేదల్లా  విపత్తుని  ప్రత్యక్షంగా జమకట్టడం. ఆ తాపత్రయం లో విపత్తుకి గురైన వాళ్ళని కేవలం అంకెలుగా జమకడతాం, ఇది  నేటి  మ్యాక్ నామిక్స్ (లెక్కలతో కూడుకున్న ఆర్ధికశాస్త్రం, గతంలో ఆర్ధిక శాస్త్రంలో స్టాటిస్టిక్స్ ఎక్కువ గా వుండేది,అంటే అంకెలు  నేడు లెక్కలు). ఐ మ్యాక్ నామిక్స్లో జీవం, ప్రకృతి విలువ కేవలం బతుకుతెరువు,ఆర్ధిక స్ధాయి అన్నది ముఖ్య అంశం, జీవించడం అన్నది కాదు. నేడు అభివృద్ధి అంచనాలలో డబ్బే కాక, హ్యాపీ లివింగ్ (సంతోషకరమైన జీవనం) అన్నది పరిగణలోనికి తీస్కుంటున్నారు.   ఇదంతా మనకి అర్ధం అవ్వాలంటే  ఆర్ వి న్యాచ్యురల్! నో, అదే పచ్చటి చీకటినుండి వెలుగులోకి వచ్చే వాస్తవం.
ఏ విపత్తు వచ్చినా,అ విపత్తుకి గురైన వాళ్లకి ముందుగా కావల్సింది మనో ధైర్యం, అది డాక్టర్లు ఇవ్వలేరు, పాలకులు ఇవ్వలేరు..  కారణం వైరస్ సోకిందన్న బాధ కంటే వాళ్ళని  కుటుంబం, చుట్టుపక్కల వాళ్ళు  ,సమాజం వేలేస్తారాన్న భయం ఎక్కువ,  ఇది వాస్తవం!. ఆ భయం నుండి  కేవలం, కుటుంబికులు, చుట్టుపక్కల వాళ్ళు, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్, ఇవ్వగల్గుతారు.  ఐసోలేషన్లో వున్నవారికంటే లేని వారి వల్ల ఇక్కట్లు ఎక్కువ. కారణం  ఏమి తోచక అటూ ఐటు పరిగెడుతారు, గుసగుసలు మొదలెడతారు. ఇక మన మీడియా ప్రపంచం దీనికి అతీతం కాదు, భయపెట్టించే డేటా ని సమాచార రూపంలో అందిస్తుంది. విశ్లేషణ తో కూడిన సమాచారం తక్కువ . మనకి డేటాకి, సమాచారానికి తేడా కూడా తెలియాలి. డేటా అంటే అంకెలు, లెక్కలు, వీటిని క్రోడీకరించి విశ్లేషించి వ్యక్తపరచడం, సమాచారం. నేడు ప్రపంచమంతా డేటా ఆధారంగా గారడీ చేస్తోంది. ముఖ్యంగా విపతులప్పుడు, అందులోనూ డేటాలో ని క్వాలిటేటివ్(నాణ్యత), క్యాంటిటేతివ్(అంకెలు) అన్న దాంట్లో ఎక్కువగా మొదటికి చెందినదే వుంటుంది, ఉదా: విపతులప్పుడు ఎంతమంది చనిపోయారు అనే వుంటుంది తప్ప ,సామాజిక ,ఆర్ధిక, సామాజిక జీవావరణ నష్టం కొలమానం లోకి రాదు!     దృశ్య, పత్రిక మధ్యమాల్లో ఎందుకు రావంటే మన మాధ్యమాలకి అంత విస్తృత అవగాహన .పరిజ్ఞానం లేదు, కారణం పరిశోధనా లోపం.
 కేవలం విపత్తు వచ్చినప్పుడు ఇవి ప్రసారం అవుతాయి, విపత్తు పోయిన తర్వాత అంతా  మామూలే , రాజకీయ ,క్రీడా , ఎంటర్ టైన్మెంట్  వార్తలు. ఈ ఘటనలు తాత్కాలికం  కనుక ఇవన్నీ టైం బీయింగ్ రియల్, ఇంకా జస్ట్ డేటా అంతే. తర్వాత వర్చ్యువల్.  ఇది ప్రకృతికీ, సమజానికీ అన్నిటికి సంబంధించినది, అవి సెన్సేషన్గా వున్నంత కాలమే వాటి జీవం. ప్రకృతి అన్నది మనకి వర్చ్యువల్ ఇట్స్ నాట్ రియల్. కారణం అన్ని వేళలా దాని విపత్తు వున్నా అది అలవాటై పట్టించుకోము, ఉదాహరణకి కాలుష్యం. కాలుష్యం అన్నది అభౌతిక మైనది కాదు , అది నేడు మన స్వాభావిక నైజం. అందుకే ఎన్ని కట్టడిలు చేసినా రోడ్డు మీదకి వచ్చే వాహనాషులు(వాహనదార్లు) వస్తూనే వుంటారు, పోతూనే వుంటారు. డార్క్ ఎకాలజి ప్రకారం దూరం వున్న బ్లాక్ హోల్ ని అర్ధం చేస్కోవడం సులభం కానీ దగ్గర వున్న మనిషి ఆలోచనల్ని అంచనా వేయడం బహు కష్టం! ఒక విపత్తు  అప్పుడే కలవలేని కులమతస్తులం ,ఇక కలిసికట్టుగా పర్యావరణాన్ని సంరక్షించి  క్లైమేట్ చేంజ్ని ఏమి అరికడతాం?   మార్కెట్ ఎకానమీ లో మనిషి ఎప్పుడో మార్కెట్ పాలకుల అధినంలోకి ఇమిడిపోయాడు,మనని మనం నియత్రించుకునే స్ధాయి, స్తోమతలో లేము , మనం ,మన జీవనం ,జీవితం అంతా మార్కెట్ పిడికిళ్ళలో వుంది . ఆ పిడికిళ్ళు విప్పితే తప్ప రహస్యాలు బయట పడవు.
నేడు  కరోన ఆ  గుప్పిట్లని విప్పుతోంది. మనం ఇళ్ళలోకి వెళ్ళి తలుపుల్ని వేస్కున్నా , గ్లోబల్ మార్కెట్  గదుల్లోని నియో లిబరలిజం రహస్యాల్ని  కుల్జా సిం సిం అంటూ బట్టబయలు చేస్తోంది...