Tuesday 25 November 2014 By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు-నేలకు పచ్చని పదాలను అల్లిన కవి-విల్లియం వర్డ్స్ వర్త్-11

18,19 వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వల్ల ప్రకృతి రూపు రేఖలు మారిపోయాయి.బొగ్గు గనులు,మిల్లులు, రైల్ మార్గాలు,ఓడ రేవుల పుణ్యమా అని ఇంగ్లాండ్ ప్రపంచంలో ఆర్ధిక శక్తి గా ఎదిగింది. పారిశ్రామీకరణ వల్ల 1801 నుండి 1901వరకు జరిగిన మార్పుల్లో ప్రధానమైనది నగరీకరణ.ఈ కాలంలో 20 శాతం నుండి 80 శాతం వరకు ఇంగ్లాండ్లో నగరవాసులయ్యారు. గ్రామాల సామాజిక స్వరుపాలు మారాయి. ఇంగ్లాండు పారిశ్రామీకరణకు పుట్టినిల్లు అయ్యింది,దానికి వ్యతిరేకత ఏర్పడింది.
ఈ వ్యతిరేకత ఆంగ్ల సాహిత్యంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విల్లియం వర్డ్స్ వర్త్ కవితల్లో(1770-1850).ఆయన కవితల్లో ప్రకృతి పురి విప్పుకుంటుంది. అయన తన జీవిత కాలంలో ఇంగ్లాండులో 175000 మైళ్ళు నడిచాడు. సాహిత్య చరిత్ర కారుడు జోనాథన్ బెట్ మాటల్లో ఆయన తన పాటకులకి ప్రకృతితో నడవడం నేర్పాడుఅంటాడు. 
పారిశ్రామీకరణ, నగరీకరణ వల్ల, ప్రకృతి విధ్వసం వల్ల సామాన్య ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చలేకపోతున్నారు అన్నాడు.నేలను పచ్చగా అల్లలేకపోతున్నారు అనీ చెప్పాడు. గ్రామీణ ప్రజలకు అక్షర జ్ఞానం లేకపోయినా ప్రకృతి తో మమేకమయే గుణం వుంది అన్నాడు. ప్రకృతితో మమేకమై జీవించడం చెప్పిన కవి వర్డ్స్ వర్త్.
తటాకాలున్న నేలతో అనుబంధం వున్న వ్యక్తి ఆయన.ఆయన చెరువులు గురించి రాసిన పుస్తకం ఇప్పుడు ఎవరికీ తెలియదు,కాని అప్పట్లో బాగా అమ్ముడుపోయిన పుస్తకం అది. ఆయన కవితా సంపుతులకంటే ఎక్కువ ఆర్ధిక సంపాదనని ఇచ్చిన పుస్తకం అదే.
ఆయన మాటల్లో ప్రకృతి సంరక్షణ అంటే అది ప్రణాళిక బద్దంగా జరగాలి, కొల్లకొట్టుకోవడానికి కాదు
ఆయన కవిత్వ తాత్వికతలో రైతులు,పశువుల కాపర్లు ప్రకృతితో మమేకమైన జీవనం ఒట్టిపడుతుంది.
ఎవరినుద్దేసించి---
పచ్చటి లోయలు ,వాగులు,గుట్టలు
పశువుల కాపర్ల ఆలోచనలు వేరు
పొలాలు, వాళ్ళ పసిడి నవ్వుల్లో ఆలోచనల్లో వాళ్ళు శ్వాసించారు
ఉమ్మడి గాలి, కొండలు నుండి అతను ఊపిరి పొందాడు
క్లిష్టతరమైన మెట్లను ఎక్కి ,ఇష్టంగా
ఎన్నో సంఘటనలు అతని మదిలో
కష్టాలు, నైపుణ్యం,ఆత్మ నిబ్బరం, సంతోషం లేక భయం;
ఓ పుస్తకంలా జ్ఞాపకాల్ని భద్రపర్చుకున్నాయి
మొద్దు పశువులు,అతను కాపాడినవి
అతను పోషించినవి, పెంచుకున్నవి
ఈ పొలాలు, ఈ కొండలు
అవి ఆయన సహచరులు,అంతకంటే ఎక్కువ
అతని రక్తం కంటే ఎక్కువ- అంత కంటె తక్కువేం కాదు? అవి అతని
భావనల్లో ఒక భాగం,అంతే
ఓ మమైక ఆరాధ్య భావన
జీవితంలోని ఆనందం ఒక అనుభూతుల భావం తప్ప ఇంకేమిలేదు . 
(
అనుసృజన)
ఓ దేశం తన ప్రాంతాన్ని అందరికీ ఉపయోగపడేలా ఉండాలి అంటే ,ఆ ప్రాంతం తన స్వారుప్య రూపాన్ని మార్చుకోకుండా,గ్రామీణ స్వారుప్యాన్ని ఉంచుకుంటూ,ఒక ప్రత్యేకమయిన చరిత్రని , గాలిలో అనే చరిత్రలో తన వునికిని కాపాడుకుంటూ,దానికంటూ చరిత్రలో ఓ గుర్తుగా వుండాలి.
ఆయన తన ప్రాంతంలో రైల్ మార్గం వల్ల చెరువులు పాడైపోతాయని దానికి వ్యతిరేకపోరాటం చేశాడు.


0 comments:

Post a Comment