Tuesday 2 December 2014 By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- చిప్కో ఉద్యమం-12

చెట్లని ఆలింగనం చేస్కుందాం
వాట్ని నరకకుండా కాపాడుకుందాం
ఇది భిల్లుల ఆస్తి
వీట్ని దోపిడీకి గురికాకుండా అడ్డుకుందాం’
(మూలం-  ఘనశ్యాం  రాటురి )
(అనుసృజన)
ఈ కవిత చిప్కో ఉద్యమంలో పుట్టింది. చిప్కో ఉద్యమం మన దేశo లోనే కాక ప్రపంచ ప్రసిద్ది చెందిన ఉద్యమం . ఉద్యమం తీరులో ప్రత్యేకత చెట్లని నరకడానికి సా మిల్లుల వాళ్ళు వచ్చినప్పుడు  స్ధానిక మహిళలు చెట్లని కౌగలించుకుని వాట్ని కాపాడారు. ఇది 1972 లో ఉత్తరాఖండు లో జరిగిన ఉద్యమం. ఇదే పద్ధతిలో ౩౦౦ సంవత్సరాల క్రితం రాజస్థాన్ లో ని బైశనవి ప్రాంతంలో కూడా జరిగింది. పవిత్రమైన ఖేజరి చెట్లని రక్షించడానికి అమ్రితా దేవి ఉద్యమం నడిపారు. తన ప్రాణాల్ని కూడ కోల్పోయారు. ఈ రెండు ఉద్యమాల్లో ప్రత్యేకత ఇవి మహిళలు చేపట్టిన ఉద్యమాలు.
వారికి,వారిలోని ప్రకృతికి సదా శిరస్సు వంచి ప్రణమిల్లుతాను.

పర్యావరణ  కవిత్వంలోని ప్రత్యేకత దాని కంటూ ఓ నరేటివ్ గుణం వుంటుంది. ఇది సహజంగా ఫోక్ లిటేరేచర్కి వుండే లక్షణం.చరిత్రని సాధ్యమైనంత పొదుపుగా ,ఓ కధలా చెప్పే తీరు. పై కవితలో రాతురి గారు అదే చెప్పారు. 

0 comments:

Post a Comment