Tuesday 30 December 2014 By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- నర్మదా బచావో ఆందోళన్-16

మ్యాక్రో  దృక్పధం లో ముఖ్యంగా వచ్చింది,మెగా డ్యాం ల నిర్మాణం. ఇది దానితో పాటు పెద్ద ఎత్తున సృష్టించింది నిర్వాసితం. నిర్వాసితానికి గురయ్యే ప్రజలు తమ గతాన్ని కోల్పోతారు, వర్తమానం భయంతో నిండి పోతుంది, భవిష్యత్తు అగ్యమ్య గోచరంగా మారుతుంది. మెగా డ్యాంలు నిర్మాణం జరిగిన ప్రదేశాల్లో ప్రకృతి తన ఉనికి కోల్పోతుంది. భారత మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1954 లో భాక్రా నంగల్ కాల్వ ఉధ్ఘాటనప్పుడు డ్యాం లను “ఆధునిక దేవాలయాలు “గా వర్ణించారు.డ్యాం ల నిర్మాణాన్ని చేపట్టినప్పుడల్లా దీనినే సూత్రీకరించడం,ప్రస్తావించడం ఆనవాయతీ అయ్యింది. ఈ దేశ సౌభాగ్యం కోసం
నా గ్రామం ముంపుకి గురైయింది
మునిగిన నా పొలాలు ఇంధనం అవుతాయి
మీ విద్యుత్ ఉత్పాదనకి
ఆ విద్యుత్ వినియోగదార్లు
ఏమి కోల్పోయారు?
మీ వాగ్దానాలు నమ్మి
మీరన్నారు మేము భూములు త్యజించాలని
అలా అయితే మేమి చేయాలి
మీ వాగ్ధానాలు మీరు పాటించకపోతే
మీరు ఏ దేశ అభివృద్ధి గురించి అయితే చెపుతున్నారో
నేను అందులో అంతర్లీన భాగం
మర్చిపోయిన ప్రజలు ఫలించని వాగ్దానాలు
నేను ఆ చెప్పని కధని
( అనానిమస్ పోయట్)
(అనుసృజన)
నెహ్రూ 1958 లో 29వ కేంద్ర బ్యూరో ఆఫ్ ఇరిగేషన్ సదస్సులో  అతి పెద్ద ప్రాజెక్టులు  ఒక వ్యాధి గా కూడా చెప్పారు. ఆ ప్రస్తావన ఎక్కడా విన్పించదు. ఈ వ్యాధి లక్షణాలు, తరచూ పెట్టు బడులు పెరుగుతాయి. వాటి నిర్మాణంలో చాలా సంవత్సరాలు  పడతాయి. ఇందులో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, నాయకులు, పెద్ద పెద్ద రైతులు బాగా లబ్ది పొందుతారు. భూమిని కోల్పోయిన వారి జీవితాలు ,త్యాగాలను ఎక్కడా ప్రస్తావించం. ఇది  ఈ కాలంలో స్వాతంత్ర్యం   తర్వాత గిరిజనులు, దళితులూ, పేదల పై దాడి.
బాబా ఆమ్టే 1980 లో దేశంలో మధ్యలో శాంతిని పెంపొందించాలన్న కోరికతో దేశ వ్యాప్తంగా క్విట్ ఇండియా అన్న సహ్రుద్భావన్ యాత్రను చేపట్టారు. ఆ యాత్రలో మతకల్లోలాలతో బాటు  ఆయనను దేశ సహజ వనరుల క్షీణత కలిచి వేసింది. దీనితో బాటు భారీ ఆనకట్టల వల్ల ఏర్పడే వ్యవస్థ కొందరికే అభివృద్ధిఫలాలను పంచుతుంది అని స్పష్ట మైంది.1988 లో  ఆనందవన్ లో జరిగిన పర్యావరణ కార్యకర్తల సమావేశంలో భారీ ఆనకట్టలకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకున్నారు. ఇవన్నీ గమనించిన బాబా ఆమ్టే 1989 లో నర్మదా ఒడ్డుకి చేరారు ,అంతకు క్రితమే ఆయన నర్మదా రోదన అన్న పుస్తకం ప్రచురించారు.ఆమడ దూరంలో నున్న నదిని పలకరించడానికి తెల్లవారే లేవడం,నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న నదితో కబుర్లు చెప్పుకోవడం. ఈ జీవనం వాళ్ళిద్దరికే చెల్లింది, ఓ రాలుతున్న తోక చుక్క  కోరిక లా...
 ఆగని వారు
ఆగని వారు.ఒరగని వారు.
అణిచి వేయబడే వారు కారు. మటుమాయం అయ్యే వారు కారు.
ఆ విప్లవం మేము.
దౌర్జన్యానికి సమాధానాలం

పర్యావరణ కవిత్వంలో సోషియాలజి ఆఫ్ పోయట్రి ని కాప్చర్ చేయచ్చు. దీని వల్ల నేర్చుకునేటప్పుడు మన దృష్టితో కాక ఎదుటి వాళ్ళ దృష్టితో పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది. సామాజిక అస్తిత్వ పోరాటాలలో  ఈ ప్రక్రియ కీలక పాత్ర వహించింది. ఆ ప్రక్రియ ఇప్పుడు కవిత్వానికి కొత్త రూపాన్ని ఆవిష్కరించేందుకు జరుగుతోంది. కవిత్వం .సాహిత్యం ద్వారా అస్తిత్వ పోరాటాల్ని వెలికి తీయడం. ఇది చేపట్టడానికి కవిత్వం, సాహిత్యంతో బాటు సోషల్ ఇకాలజిని అర్ధం చేసుకోవాలి.

0 comments:

Post a Comment