Wednesday 24 December 2014 By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- నర్మదా బచ్చావో ఆందోళన్-15

అభివృద్ధి పేరుతొ పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి గిరిజనలను తమ నేలశ్వాస కొసనుండి దూరం చేస్తున్నారు.నర్మదా నది పై తలపెట్టిన 30 డ్యాం లలో అతి పెద్దవి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్, నర్మదా సరోవర్ ప్రాజెక్ట్.నర్మదా నది మైకల్ శ్రేణులలోని  సముద్రానికి 1057 మీటర్ల ఎత్తులో అమరకాన్తాక్ ప్రాంతంలో పుట్టి అరెభియన్ సముద్రంలో కలిసే ముందు మధ్య ప్రదేశ్ , గుజరాత్, మహారాష్ట్రల గుండా 1312 కి.మీ. ప్రవహిస్తుంది.మన ప్రాచిన గ్రంధాలలో పేర్కొన్న 7 పవిత్ర నదుల్లో ఇది ఒకటి. ఈ నది చుట్టూ వైవిధ్యమైన సంస్కృతీ, ప్రకృతి, జనజీవనం ముడి పడి వుంది. అందులో గిరజనులు అల్లుకున్ని వున్నారు. ఈ నది పై ఆనకట్టలు కట్టాలన్న ప్రతిపాదన బ్రిటిష్ వారి కాలం నుండి వుంది.అప్పుడు వాళ్ళు (1901) ఎంచుకున్న ప్రాంతం భరుచ్ లో నల్ల రేగడి భూమి అనువైనది కాదని ఆ ఆలోచనని విరమించుకున్నారు. మళ్ళి స్వాతంత్ర్యం తర్వాత పండిట్ నెహ్రు గారు ఉదహరించిన డ్యాములు- ఆధునిక దేవాలయాలు అన్న స్పూర్తి తో ఈ ప్రక్రియ వెలుగులోకి వచ్చింది1965 డ్యాం ప్రతి పాదనలు కొనసాగింపు మొదలైంది.
నర్మదా వ్యాలిని స్వర్గసీమ గా వర్ణిస్తారు. ఈ స్వర్గ సీమలో తలపెట్టిన ఈ ప్రయోగం గిరిజనుల పాలిట నరకంగా మారింది. పారిశ్రామిక కరణ వల్ల అన్నీ పెద్దవిగా నిర్మంచాలి అన్న తపన పెరిగింది. ఆ ప్రయోగాలలో డ్యాం ల నిర్మాణం ఒకటి. పారిశ్రామీకరణ పూర్వం వున్న అభివృద్ధి నిర్వచనాన్ని మార్చేసింది. ఒక మెగా పర్సపెక్టివ్ ని తీసుకువచ్చింది. మైక్రో నుండి మాక్రో దృక్పదం. ఈ దృక్పదంలో స్మాల్ సొసైటీలు కొట్టుకు పోతాయి.అంతే కాదుకొన్ని వేల సంవత్సరాల సంస్కృతీ ఒక త్రుటిలో మటు మాయమవుతుంది. ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఇది కల్చరల్ ఎరోషన్. ప్రకృతి లోని భూమి కోత లాంటిది. డ్యాం వల్ల కొందరి భూములు సారవంతమవుతే,స్ధానికుల జీవితాలు నిస్సారమవుతాయి.పల్లపు ప్రాంతాల వాళ్ళకి బంగారు భవిషత్తు ఏర్పడితే, స్ధానికుల భవిష్యత్తు నిర్విర్యమవుతుంది.అభివృద్ధిలో నిర్వాసితం ఇన్ని రూపాల్లోప్రబలుతుంది . కాని మనకి కన్పించేది కేవలం స్ధానికులు భౌతికంగా నిర్వాసితం అవ్వడమే. ఈ మెగా దృక్పదం క్రమేణా ఆల్విన్ టాఫ్లర్ చెప్పినట్టు  ఇది  అంతటా ఒక ఫ్యూచర్ షాక్ ని సృష్టిస్తుంది. ఈ గమనంలో మనం విస్మరించేది మనం పిల్చే ప్రతి శ్వాస,మనం ఇతర జివ రాశులతో కలిసి బతుకుతున్నాం అన్నది పునరుద్గాటిస్తుంది. మన పూర్వికులతో వున్న సంభందాన్ని పునర్జివింప చేస్తూ ,మన ముందు తరం తో కొనసాగిస్తుంది. మన శ్వాస మన జీవన్ శ్వాసలో ఒక భాగం. ఈ భూమిని అల్లుకున్న గాలి సముద్రం.- డేవిడ్  సుజుకి.
పర్యావరణ కవిత్వంలో నెరేటివ్ కాపిటల్ ని కాప్చర్ చేస్తునప్పుడు, గతం ,వర్తమానం తో బాటు భవిష్యత్తుని ప్రస్తావించాలి. ప్రస్తావనలో  అది వాస్త వానికి దగ్గర వుండాలి. అది దయా పావర్  నర్మదా ఆందోళనకు సంభందించిన గేయంలో ప్రస్తావించారు.
డ్యాం కట్టడంలో
జీవితాన్ని సమాధి చేస్తాను
పొద్దు పొడుస్తుంది
నా రోట్లో మాత్రం
వుట్టి చప్పుడే
నిన్న వరి కుప్పలేసిన చోట
ఈ రోజు వడ్లు యేరుకుంటాను
సుర్యోదయమైంది
బుట్ట నీడలో బిడ్డ నుంచి
కళ్ళల్లో కన్నీళ్ళు వుంచి
డ్యాం కట్ట డానికి వెళతాను
డ్యాం పూర్తయింది
వాళ్ళ భూముల్లోని చెరుకు గడలో
శారముంది
నేను మాత్రం అడవి ఎడారిలో
గుక్కెడు మంచి  నీళ్ళ కోసం ఓడ నవుతాను
నా చెమట వర్షం తో నేల తడుస్తుంది
నా ముంగిట్లో మాత్రం
ఎండుటాకులు రాలుతాయి

(దయా పావర్) (అనుసృజన)

0 comments:

Post a Comment