Tuesday 27 January 2015 By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు- సైలెంట్ వ్యాలీ ఉద్యమం-19

స్వాతంత్ర్యానంతరం స్వాతంత్ర్య పోరాటం కూడా కొనసాగుతుంది అనటానికి నిదర్శనం పర్యావరణ ఉద్యమాలు. మనం విదేశీయలనుండి విముక్తి పొందాం కాని మన వనరుల నిర్వహణలో వాళ్ళ ఆలోచనలు,ప్రణాలికల నుండి మాత్రం కాదు. అప్పడు గీసిన  సర్వే రేఖలు ఆన్ని రంగాల్లో ఇప్పటికీ చెరిగి పోలేదు. ఇప్పుడు ఓ మూడొందలు చిలుకు చట్టాలు పనికి రావని వాట్ని తొలగించాలని ప్రయత్నాలు మొదలైయాయి. ఒక విధంగా దీనిని మనకంటూ మన ప్రణాలికల్ని మనంతట మనమే రుపొందిచుకునే ప్రయత్నం గా బావించాలి. ఈ తీరు మన వనరుల నిర్వహణలో మనకంటూ వున్న ఊహలకి  ప్రణాళికనిస్తుంది. అదే విధంగా మన చరిత్రను భద్రపరుస్తుంది.
స్వాతంత్ర్యానంతరం చేపట్టిన ప్రాజెక్టులన్నిటికీ మూలాలు బ్రిటిష్  హయంలో  ప్రవేశ పెట్టిన ఆలోచనలే, అందుకే ఈ వ్యతిరేకత ఏర్పడుతోంది.వారికి స్థానిక అవసరాలకంటే వ్యాపార లక్ష్యాలు ముఖ్యం ,కాని మనకి స్థానికత కీలకం. దీనిని విస్మరించి మొండిగా ప్రాజెక్ట్లు చేపడితే ముందుగా జరిగేది వ్యతిరేక గళాల ప్రతిధ్వని. ఇది నిరూపించింది  సైలెంట్ వ్యాలీ ఉద్యమం.1929 లో ఒక బ్రిటష్ ఇంజనీర్ కేరళలోని సైలెంట్ వ్యాలీ లో హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టుని నిర్మించాలని ఊహించాడు కాని చేపట్టలేదు. అతని ఊహకు అందని విషయం యాభై,అరవై సంవత్సరాల తర్వాత ఈ విషయం పై ఒక ఉద్యమం జరుగుతుందని. ఇది మన దేశంలో వున్న అరుదైన సతత హరిత అడవి.8950 హెక్టార్ లలో విస్తరించి వుంది. కొన్ని వందల సంవత్సరాలుగా మనుషులు జాడ అతి తక్కువగా వుండి సురక్షితంగా వుంది. ఇది  40,000 హెక్టార్  లలో నిరంతరంగా విస్తరించివుంది.ఇక్కడ రైల్వే స్లీపర్ల కోసం ఒక  ఎకరాలో కేవలం రెండు లేదా మూడు చెట్లు నరికబడ్డాయి. 19 శతాబ్దంలో కాఫీ తోటల్ని పెంచాలని ప్రయత్నం చేసి తర్వాత వైదొలిగారు, మన దేశంలో అంతరించిపోయి,అరుదై పోయిన వన్యప్రాణులకి గూడు ఈ ప్రాంతం.
సర్వాత్రా జరిగేదే ఇక్కడ జరిగింది.1973లో అప్పటికే ప్రణాళిక సంఘం వారు ఆమోదించిన హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు విషయం వెలుగు లోకి వచ్చింది. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్నది రోములస్ విటేకర్, ఈమె తన భర్త జాయి విటేకర్ తో కలిసి కేరళలో పాముల పై అధ్యనం చేయడానికి ఆస్ట్రేలియా నుండి వచ్చి అక్కడ స్థిరపడ్డారు.ఈ విషయం పై తన వ్యతిరేకతను తెలుపుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది,క్రమేణా ఈ విషయం గురించి తెలుసుకున్న కేరళ లోని మేధావులు,పర్యావరణ ప్రేమికులు ప్రాజెక్టుకు వ్యతిరేకతను తెలిపారు. ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది కేరళ శాస్త్ర సాహితి పరిషత్.ఈ వ్యతిరేక నినాదాల్లో వచ్చిన పర్యావరణ పద జాలాన్ని కించపరిచారు, ఉదా: వర్జిన్ ఫారెస్ట్(virgin forest) , విశిష్ట (unique) అడవులు. అన్ని రాజకీయ పార్టీలు ప్రాజెక్టును సమర్ధించాయి.  ఈ ఉద్యమంలో సాహితి వేత్తలు కీలక పాత్ర వహించడం దీనికున్న ప్రత్యేకత. నిశ్శబ్ద లోయ ప్రతిధ్వనుల తరంగాలు వీరి ద్వారా ప్రకోపించాయి.పర్యావరణానికున్న ఒక రొమాంటిక్ ఇమేజరి నుండి జీవనానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని తెలిపాయి.
కేరళ సాహిత్యంలో పర్యావరణానికి  సంబంధించిన కవితల్లో ఉలూర్ యస్.పరమేశ్వర్ అయ్యర్ (1877-1949) ‘The Hymn of Love’(ప్రేమ సంగీతం-1933) ని ప్రధమ కవితగా భావిస్తారు.
ప్రపంచానికి ఒక నమ్మకం వుంది-ప్రేమ, అది ,
పున్నమి చంద్రుడు మనకి తన తేనెని అందిస్తాడు ,ఆరగించడానికి-పాలు,
విశ్వం వివిధ రూపాల్లో భక్తిని ప్రదర్శిస్తుంది,
ప్రేమ,కోరిక,ఇష్టం,
నేల పై తన వాంఛను కురిపిస్తుంది,
ద్వేషం,శత్రుత్వం, అది కేవలం నాస్తిక వాదన నమ్మకం:
అయ్యో! చీకట్లో పడిపోయిన ప్రపంచం అర్ధాంతర చావుని కొని తెచ్చుకుంటుంది,
విధ్యంసకరమైన మూర్తి ప్రేమ సంబంధాల్ని అగ్నికి ఆహుతి చేస్తుంది,
పూల తోటని బీడు భూమిగా, స్వర్గాన్ని నరకంగా.
(అనుసృజన)

మేధావులు దీనిని కవిత్వoగా జమకట్టక పోవచ్చు,అనువాదంలో కవిత్వ తత్వాని చేరక పోవచ్చు, ప్రకృతి, మన మనస్సులు కవిత్వమయం చేసినప్పుడు జీవితం పర్యావరణీయం అవుతుంది.

0 comments:

Post a Comment